మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దూబే కథ క్లైమ్యాక్స్ కు చేరింది ఏ క్షణమైనా అరెస్టు లేదా ఎన్కౌంటర్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. అతనికి సాయం చేస్తున్న అసిస్టెంట్ల ను కుదిరితే అరెస్టు లేకపోతే ఎన్కౌంటర్ చేస్తున్నారు పోలీసులు అందులో భాగంగా ఈరోజు వికాస్ దూబే అసిస్టెంట్ లలో ఒకడైన అమర్ దూబే ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు అలాగే మరో అసిస్టెంట్ శ్యాము బాజ్ పాయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో అతని పై పోలీసులు కాల్పులు జరిపారు దాంతో శ్యాము కుడి కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది ప్రస్తుతం అతన్ని ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. శ్యాము తలపై 25000 రివార్డు వుంది. 
మరోవైపు యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం మధ్యప్రదేశ్ లో వున్న వికాస్ దూబే ,బావ రాజీవ్ నిగమ్ ను విచారిస్తున్నారు. ఇప్పటికే వికాస్ దూబే కు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. కాగా 5రోజుల క్రితం వికాస్ దూబేను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై వికాస్ దూబే అతని అనుచరులు కాల్పులు జరపడంతో 8మంది పోలీసులు అక్కడికక్కడే  ప్రాణాలు విడిచారు. ఈ ఎన్కౌంటర్ లో హతమైన పోలీసుల కుటుంబాలకు కోటి రూపాయలతో పాటు పెన్షన్ ,ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: