ఇప్పుడు అంతా ప్రకృతి విపత్తుల సమయం నడుస్తోంది. వైరస్‌లు, బ్యాక్టీరియాలు, చివరకు మిడతలు కూడా మనుషులను వణికిస్తున్నాయి. ఆ మధ్య పాక్ వంటి ఇతర దేశాలను వణికించిన మిడతల దండు.. ఇప్పుడు ఉత్తర భారతాన్ని ఇబ్బంది పెడుతోంది. మహారాష్ట్ర వరకూ వచ్చిన ఈ మిడతల దండు.. లక్కీగా తెలుగు రాష్ట్రాలకు రాకుండానే వెనుదిరిగింది. 

 


ప్రస్తుతం ఆ మిడతల దండు ఉత్తర భారతంలోనే ఉంది. ఆయన మరి ఈ ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తున్న మిడతల దండు ఏమిటంటారా.. ఇది పూర్తి రాజకీయ విమర్శల కోసం వాడుకున్న మిడతల దండు అనే చెప్పుకోవాలి. ప్రత్యర్థులను ధీటైన మాటలతో విమర్శించడంలో ముందుండే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు ప్రత్యర్థులపై విమర్శల కోసం మిడతల దండును ఉపయోగించారు. 
 

IHG

 

ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తరచూ వైసీపీ సర్కారుపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అందుకే తాజాగా విజయసాయిరెడ్డి కన్నా లక్ష్మీనారాయణపై ఘాటైన పదజాలంతో విమర్శల వర్షం కురిపించారు. పసుపు మిడతల దండులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ భాగస్వామి అవుతున్నారా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. 

 

IHG


విజయసాయి ఏమంటున్నారంటే.. “  ఏంటి కన్నా! తమరు మాత్రం అన్ని పార్టీల వ్యవహారాల్లో వేలు పెడతారు. లేస్తే మనిషిని కాదన్నట్లు లేఖాస్త్రాలు సంధిస్తారు. టీడీపీ మిడతల దండు బీజేపీపై వాలిందని మేం అలర్ట్ చేస్తే తప్పా..? బాబు అజెండాతో కమలం పువ్వును ఆంధ్రాలో కబళించే పనిలో ఉన్న.. ఆ పసుపు మిడతల దండులో మీరూ భాగస్వామేనా.?' అంటూ విజయసాయి ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: