మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన నుండి రైతులకు ప్రాధాన్యతను ఇస్తుంది. రైతుల కోసం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన విషయం విదితమే. అయితే తాజగా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. అన్నదాతను ఆదుకునేందుకు ప్రత్యేక ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

 

 

రూ.లక్ష కోట్లతో అగ్రికల్చర్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలియజేశారు. దీనికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ఇతర ఏజెన్సీలతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. 

 

 

అయితే అగ్రి ఫండ్‌లో భాగంగానే శీతల గిడ్డంగులు, వేర్‌హౌస్‌లు, ఇమార్కెటింగ్ పాయింట్లు, ఇట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ వంటి వాటిని నిర్మిస్తామని తోమర్ తెలియజేశారు. అంతేకాకుండా ప్రైమరీ అగ్రి క్రెడిట్ సొసైటీ, ఫార్మర్స్ గ్రూప్, అగ్రి ఎంట్రప్రెన్యూర్స్, స్టార్టప్స్, అగ్రి టెక్ సంస్థలకు నిధులు అందజేస్తామన్నారు.

 

 

అయితే ఈపీఎఫ్ అకౌంట్‌లో సాధారణంగా కంపెనీ 12 శాతం, ఉద్యోగి వేతనంలో 12 శాతం (బేసిక్, డీఏ) జమవుతూ వస్తుందన్నారు. అయితే కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వమే ఈ కంట్రిబ్యూషన్‌ను భరిస్తోందన్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలలకు మోదీ సర్కార్ పీఎఫ్ డబ్బులను మీ తరుపున, మీ కంపెనీ తరుపున ఈపీఎఫ్ ఖాతాలో జమచేస్తూ వచ్చిందన్నారు.

 

 

ఇలాగే ఇప్పుడు మరో 3 నెలలపాలు పీఎఫ్ కంట్రిబ్యూషన్ భారాన్ని కేంద్రమే భరించనుందన్నారు. అంటే జూన్ నుంచి ఆగస్ట్ వరకు పీఎఫ్ డబ్బులు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఈ ఫెసిలిటీ అందిస్తోందన్నారు.

 

 

అయితే తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై ఏకంగా రూ.4860 కోట్ల భారం పడనుందని సమాచారం. దాదాపు 72 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. అలాగే గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్‌ను కూడా నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: