దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. కరోనా బారిన పడే వారి సంఖ్యా రోజు రోజుకు గణనీయంగా పెరిగిపోతుంది. ఈ మహమ్మారి కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించిన విషయం విదితమే. అయితే దేశంలో లాక్ డౌన్ సడలింపులు చేసిన దగ్గరిని నుండి కరోనా బాధితుల సంఖ్యా ఘననీయంగా పెరిగిపోతుంది. దింతో ప్రజలు ఇంట్లో నుండి బయటికి రావడానికే భయపడిపోతున్నారు.

 

 

ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం వారికీ అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. దేశ ప్రజలకు ఆసరా ఇవ్వడం కోసం కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం తాజాగా పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త అందించిందని సమాచారం. మరో మూడు నెలలపాటు పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను కేంద్రమే భరించనుందన్నారు. దీంతో పీఎఫ్ చందాదారులకు ప్రయోజనం కలుగనుందన్నారు. కరోనా వైరస్ సమయంలో ఊరట లభించనుందని నిపుణులు తెలిపారు.

 

 

అయితే పీఎఫ్ అకౌంట్‌లో సాధారణంగా కంపెనీ 12 శాతం, ఉద్యోగి వేతనంలో 12 శాతం (బేసిక్, డీఏ) జమవుతూ వస్తుందని తెలిపారు. అయితే కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వమే ఈ కంట్రిబ్యూషన్‌ను భరిస్తోందన్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలలకు మోదీ సర్కార్ పీఎఫ్ డబ్బులను మీ తరుపున, మీ కంపెనీ తరుపున ఈపీఎఫ్ ఖాతాలో జమచేస్తూ వచ్చిందని తెలియజేశారు.

 

 

ఇలాగే మరో మూడు నెలలపాలు పీఎఫ్ కంట్రిబ్యూషన్ భారాన్ని కేంద్రమే భరించనుందన్నారు. అంటే జూన్ నుంచి ఆగస్ట్ వరకు పీఎఫ్ డబ్బులు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని సమాచారం. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఈ ఫెసిలిటీ అందిస్తోందన్నారు.

 

 

తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై ఏకంగా రూ.4860 కోట్ల భారం పడనుందన్నారు. దాదాపు 72 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలియజేశారు. అలాగే గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్‌ను కూడా నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారని సమాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: