దేశం పాపంతో నిండిపోయింది.. కుటుంబ బాంధవ్యాలు పూర్తిగా మంటకలిసి పోయాయి.. పక్కవారి గురించి ఎవరికీ పట్టింపు లేకుండా పోతుంది.. రోడ్డుపై ఎవరైనా కష్టాల్లో ఉంటూ చూస్తూ వెళ్తున్నారు.. మరీ దౌర్భాగ్యం ఏంటంటే కొంత మంది సెల్ ఫోన్ లో షూట్ చేస్తూ వెకిలి చేష్టలు చేస్తున్నారని రోజూ వింటూనే ఉన్నాం. కానీ దేశంలో మానవత్వం ఇంకా ఉందని ఓ మహిళ చాటి చెప్పింది.  ఓ అంధుడి కోసం పరిగెత్తుకుంటూ బస్సును ఆపి అతన్ని దగ్గరుండి మరీ తీసుకు వచ్చి బస్సు ఎక్కించి వెళ్లింది.. ఈ ఘటన కేరళలో జరిగింది.

 


ఇందుకు సంబంధించిన వీడియోను విజ‌య్ కుమార్ అనే ఐపీసీ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. సదరు మహిళపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‌ ఓ వృద్దుడు.. అందులోనూ అంధుడు.. బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు.. అంతలోనే బస్సు అక్కడ నుంచి వెళ్లిపోతుంది.

 


ఇది గమనించిన ఓ మహిళ వెంటనే పరుగెత్తుకుంటూ ఆ బస్సు కండెక్టర్ ని ఆపాలని.. ఓ వ్యక్తి వస్తున్నాడని చెప్పింది. అలా చెప్పి వెళ్లకుండా ఆమె స్వయంగా అతని వద్దకు వెళ్లి తీసుకు వచ్చి బస్సు ఎక్కించి పంపించింది.  ఆమె చూపిన మానవత్వానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: