ఇద్దరు ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకున్నారు... పెళ్లి చేసుకొని భావించినప్పటికీ పెద్దలు ఒప్పుకోరేమో అని భయపడ్డారు. ఇక పెద్దలను ఎదిరించి అయినా సరే ఒకటి కావాలని అనుకున్నారు. ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో.. పెళ్లయి మూన్నేళ్ళు  కూడా తిరగకుండానే... ఈ జంట  విగతజీవులుగా మారిపోయారు. భార్య బెడ్ పై ప్రాణాలు వదలగా  భర్త ఉరికి వేలాడుతూ ప్రాణాలు వదిలాడు. దీంతో అసలు ఇది ఎలా జరిగింది అన్నది ప్రస్తుతం మిస్టరీగా మారింది. ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఎవరైనా హత్య చేశారా అన్న దానిపై ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

 


 తాజాగా ఈ ఘటన కేరళలోని అలాప్పుజాలో  చోటు  చేసుకుంది, జిల్లాలోని పండలం ఏరియాకు చెందిన జితిన్  అదే ప్రాంతానికి చెందిన టీనేజ్ యువతి ని  ప్రేమించాడు. ఇక ఆ తర్వాత వీరిద్దరు  పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోని ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే యువతి  కాస్త మైనర్ కావడంతో జీతిన్  పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. వ్యవహారం కోర్టు వరకు వెళ్లగా తాను జితిన్ తోనే  ఉంటానని అతన్నే పెళ్లి చేసుకుంటానని మైనర్ బాలిక చెప్పడంతో ఆమెను చిల్డ్రన్స్ హోమ్ కి తరాలించారు . 

 

 మైనర్ కాస్త మేజర్ అయ్యాక జితిన్ తో  కలిసి కొన్నాళ్ల పాటు సహజీవనం చేసింది . గతేడాది ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, జగన్ పెయింటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఎవరూ ఊహించని విధంగా ఇద్దరు విగతజీవులుగా కనిపించడం సంచలనంగా మారింది. పెళ్లి చేసుకొని మూణ్నెల్లు  కూడా తిరగకుండానే ఈ కొత్త జంట ప్రాణాలు వదిలారు. అయితే దేవిక శరీరంపై గాయాలు ఉండటం ప్రస్తుతం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. భార్యను కొట్టి హత్య చేసి భర్త  ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని  కొంత మంది.. లాక్ డౌన్  కారణంగా ఇద్దరు ఆత్మహత్య చేసుకుని ఉంటారని  కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: