రోజురోజుకు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎంత కఠినంగా శిక్షించినా ఎవ్వరి లో మార్పు మాత్రం రావడం లేదు. సభ్య సమాజం మొత్తం తలదించుకునే విధంగా ఎన్నో సంఘటనలు తెరమీదకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోజు రోజుకుమహిళల జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతోంది. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు దారుణంగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.తాజాగా ఇలాంటి ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది.
తన ఇల్లు కట్టిన కూలీలకు యజమానురాలు ఒక పార్టీ వచ్చింది అయితే దావత్ లో ఫుల్లుగా తాగి ఏకంగా యజమానురాలు పైన అత్యాచారం చేసి చెప్పారు కూలీలు . ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది, కులసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘట స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 7వ తేదీన రాత్రి జియాగూడ లో ఇంటి నిర్మాణం పూర్తయిన సందర్భంగా ఇంటి యజమాని ఆండాళ్ కూలీలకు విందు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే కూలీలు విందులో ఫుల్లుగా తాగారు . ఆ తర్వాత అన్నం పెట్టిన యజమానురాలి పై వక్రబుద్ధి చూపింఛీ అత్యాచారం చేసారు.
ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్న కూలీలు దారుణంగా విందు ఏర్పాటుచేసిన యజమానురాలు పైన అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా... ఆమె ఈ విషయం ఎవరికీ చెబుతుందో అనే భయంతో ఏకంగా యజమానురాలు నే కడతేర్చారు కూలీలు. అయితే అక్కడే ఉన్న బాధిత మహిళ కొడుకు వాళ్ళని ఆపేందుకు వెళ్లినప్పటికీ పక్కకు నెట్టేశారు, అనంతరం ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ విషయం కాస్త బయటికి రావడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.