మామూలుగానే పాకిస్తాన్ ఎప్పుడెప్పుడు భారత్పై దాడి చేయాల అని ఎదురు చూస్తూ ఉంటుంది అనే విషయం తెలుస్తుంది. ఏ చిన్న అవకాశం దొరికినా భారత్లో విధ్వంసాలు సృష్టించేందుకు సిద్ధంగా ఉంటుంది. స్వయంగా పాకిస్తాన్ ఆర్మీ అక్కడినుంచి భారత్ ను నాశనం చేయడానికి ఉగ్రవాదులను పంపిస్తుంది అనే టాక్ కూడా ఉంది. ఇలా భారత్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు ఎన్నోసార్లు విధ్వంసాలు కూడా సృష్టించారు. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం పాక్ సైన్యం గాని ఉగ్రవాదుల కుట్రలు  ఫలించడం లేదు అన్న విషయం తెలిసిందే. 

 

 ప్రస్తుతం సైన్యాని కి పూర్తి అధికారాలు రావడం తో ఎప్పటికప్పుడు సరిహద్దు ల్లో పాకిస్తాన్ నుంచి భారత్ లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదుల ను మట్టుబెడుతుంది  భారత సైన్యం. ఇదిలా ఉంటే ప్రస్తుతం భారతదేశం లో కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎంతో అద్భుతంగా పని చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పాకిస్తాన్ లో జరిగిన ఓ  హత్య ను కౌంటర్ ఇంటెలిజెన్స్ చేసింది అని టాక్ ప్రస్తుతం వినిపిస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ మొత్తం ఇదే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆల్ఖైదా సంస్థల తో సంబంధా లు ఉన్నటువంటి ఉగ్రవాద నాయకుడిని పాకిస్తాన్లో కాల్చిచంపారు, 

 

 ఈ నేపథ్యంలో ఇది భారత్ చేయించిందని అక్కడ అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఐఎస్ఐ కోసం పని చేస్తున్న మాజీ రేంజర్ ఆఫీసర్ ఆశిక్ ని కరాచీలోనే  గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడంతో... ఇది భారత్కు చెందిన రా పనే అని.. ఐఎస్ఐ నిన్న ప్రకటించింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాద సంస్థలకు సమాచారం అందిస్తూ ఉంటున్నా ఇద్దరు వ్యక్తులు చనిపోవడం ప్రస్తుతం పాకిస్థాన్లో పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. దీన్ని బట్టి చూస్తే పాక్లో ఏదో జరుగుతుంది అన్నది స్పష్టంగా అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: