కరోనా వేళా కదా.. ప్రతి దానికి మనం బయటకు వెళ్లలేం. అందుకే ఏది కావాలి అన్న ఆన్లైన్ ఆర్డర్ పెట్టేస్తున్నాం. ఇంకా ఈ నేపథ్యంలోనే స్విగ్గి అయినా.. జొమాటో అయినా.. ఫ్లిప్ కార్ట్ అయినా మరేదైనా ఒకటి ఆర్డర్ పెట్టినప్పుడు అడ్రెస్ కరెక్ట్ గా పెడుతాం. అడ్రెస్స్ కరెక్ట్ పెట్టకపోతే చాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.     

 

ఇంకా అంతే కాదు.. అడ్రెస్స్ పెట్టె సమయంలో ల్యాండ్‌ మార్క్‌ అనే చోటా స్కూలో, గుడినో, థియేటర్ నో ఏదో ఒకటి ఇవ్వడం అనేది కామన్ విషయం. కానీ ఓ కస్టమర్ ఇచ్చిన అడ్రెస్స్ చూస్తే షాక్ అయ్యి పగలబడి నవ్వుతారు. అంతటి షాకింగ్ విషయం అది. ఇంకా అది సోషల్ మీడియాలో పోస్ట్ అవ్వగానే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.   

 

అంతగా ఎం చేశాడు అంటే? రాజస్థాన్‌లోని కోటకు చెందిన ఓ కస్టమర్‌ ఫ్లిప్‌కార్ట్‌లో ఓ వస్తువు ఆర్డర్‌ పెట్టాడు. ఇంకా అందులో తన పేరు కింద అడ్రస్‌ రాయాల్సిన చోట ల్యాండ్‌మార్క్‌గా గుడి గురించి రాశాడు. ''ఓ గుడి వద్దకు వచ్చి ఫోన్‌ చేస్తే తాను అక్కడికి వచ్చి వస్తువును తీసుకుంటానని'' ఆ అడ్రెస్ లో పేర్కొన్నాడు.  

 

ఇంకా ఈ విషయాన్నీ ఫ్లిప్ కార్ట్ ఏ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. దీంతో ఇది వైరల్ గా మారింది. ఇది చుసిన నెటిజన్లు కామెడీగా స్పందిస్తున్నారు. మరి ఆ ఫోటోను మీరు ఓ సారి చూసేయండి.      

 

మరింత సమాచారం తెలుసుకోండి: