కేవలం మాస్కులు ధరించి శానిటైజర్ వాడటమే కాదు.. రోగ నిరోధక శక్తిని పెంచడం ఎలా అన్న దానిపై ఎన్నో చిట్కాలను కూడా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ పై జనాలకు ఉన్న భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు. ఇవి తింటే కరోనా వైరస్ పోతుంది... అది తింటే కరోనా వైరస్ కు చెక్ పెట్టొచ్చు అంటూ సోషల్ మీడియాలో ఎన్నో ప్రచారాలు చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. ఈ ప్రచారాలతో అటు ప్రజలు కూడా అయోమయంలో పడిపోతున్నారు.
తాజాగా ఇక్కడొక స్వీట్ షాప్ యజమాని ఇలాంటిదే చేశాడు. కరోనా వైరస్ భయాన్ని క్యాష్ చేసుకుని బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకున్నాడు. తన షాపులో మూలికలతో తయారైన మైసూర్ పాక్ తింటే ఒక్కరోజులోనే కరోనా వైరస్ నుంచి కోల్పోవచ్చు అంటూ ప్రచారం మొదలు పెట్టాడు. తమిళనాడు కోయంబత్తూరు జిల్లా తోటపాలెయం లోని లాలా అనే స్వీట్ ఎజమాని మైసూర్ పాక్ తింటే కరోనాకు చెక్ పెట్టొచ్చు అంటూ ప్రజలను బురిడీ కొట్టించాడు, ఇక ఈ విషయం ఆహార శాఖ అధికారుల వరకు వెళ్లడంతో.. షాప్ పై తనిఖీలు నిర్వహించిన అధికారులు... షాప్ ని సీజ్ చేశారు. ఇలాంటి అవాస్తవాలను ప్రజలు నమ్మి మోసపోవద్దు అని సూచించారు.
Powered by Froala Editor