దేశంలో కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచేందుకు పలు పథకాలను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్‌పీఎస్ టైర్ 2 అకౌంట్‌పై పన్ను ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. మోదీ సర్కార్ ఒక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజన కలుగనుందని అధికారులు తెలిపారు.

 


అయితే నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్‌ టైర్ 2 అకౌంట్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 80 సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చునని తెలియజేశారు. అయితే ఈ బెనిఫిట్ పొందాలంటే ఎన్‌పీఎస్ టైర్ 2 అకౌంట్‌కు లాకిన్ పీరియడ్ 3 ఏళ్లుగా ఉంటుందన్నారు.

 

 

అయితే ఎన్‌పీఎస్ టైర్ 2 అకౌంట్‌ తెరవాలంటే కనీసం రూ.1000 కావాలన్నారు. తర్వాత కనీసం రూ.250 ఇన్వెస్ట్ చేసిన సరిపోతుందన్నారు. ప్రభుత్వపు తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలుగనుందన్నారు. ప్రైవేట్ రంగ ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారితో పోలిస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కు ట్యాక్స్ పరంగా ఇది ఊరట కలిగే అంశమని చెప్పొచ్చునన్నారు.

 

 

అయితే ఎన్‌పీఎస్ స్కీమ్‌లో రెండు రకాల అకౌంట్లు ఉంటాయని తెలిపారు. ఒకటేమో టైర్ 1. రెండోదేమో టైర్ 2. టైర్ 1 అకౌంట్ అనేది డిఫాల్ట్ అకౌంట్ అని తెలియజేశారు. ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చునన్నారు. ఇక టైర్ 2 అకౌంట్ అనేది ఆప్షనల్ అని తెలిపారు.

 


అయితే ఎన్‌పీఎస్ టైర్ 1 అకౌంట్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్‌లోకి సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు రూ.50,000 వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చునని తెలిపారు. ఇది సెక్షన్ 80సీ కింద పొందే రూ.1.5 లక్షల పన్ను మినహాయింపునకు అదనం అని యాజమాన్యం తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: