హైదరాబాద్ నగరంలో మరో సెక్స్ రాకెట్ బయటపడింది. మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఓయో రూమ్స్ లో సురేందర్ అనే వ్యక్తి గుట్టుగా నిర్వహిస్తున్న వ్యభిచార క్రేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించారు. భాగ్యనగరంలో వ్యభిచార కేంద్రాల నిర్వహణ రోజురోజుకు పెరుగుతోంది.లాక్ డౌన్ కారణంగా గత నాలుగు నెలల నుంచి ఆగిన పనులు ఇప్పుడు మళ్లీ కొనసాగుతున్నాయి.

 


గుట్టు చప్పుడు కాకుండా నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షిస్తూ తమ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు.  రెండు రోజుల కిందటే నగరంలో ఓ సెక్స్ రాకెట్ ను చేధించిన పోలీసులు తాజాగా మరో కేసును వ్యభికేంద్రంపై దాడులు చేశారు. మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో దాడులు నిర్వహించి ముగ్గురు సెక్స్ వర్కర్లతో పాటు ఓ విటుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు  పోలీస్ స్టేషన్ తరలించారు. 

 


అయ్యప్య సొసైటీలోని సూపర్ మార్కెట్ మూడో అంతస్తులో గత కొన్నినెలలుగా సురేందర్ రెడ్డి అనే వ్యక్తి ఓమో రూమ్స్ నిర్వహిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా వ్యాపారం కుదేలవడంతో సులభంగా డబ్బులు సంపాదించాలనుకుని తప్పుడు పనులు మొదలు పెట్టాడు. వేరే రాష్ట్రాలకు చెంది ముగ్గురు యువతులను నగరానికి తీసుకువచ్చి తన లాడ్డిలో ఉంచాడు.

 


ఓయో రూమ్స్ కి వచ్చే కస్టమర్లకు అమ్మాయిలను చూపించి క్యాష్ చేసుకోవడం ప్రారంభించాడు. ఓయో రూమ్స్ లో వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నాడని స్థానికులు సమాచారంతో మాదాపూర్ పోలీసులు అక్కడికి చేరుకుని లాడ్జిపై దాడులు నిర్వహించారు. నిర్వాహకుడు సురేందర్ రెడ్డితోపాటు ముగ్గురు సెక్స్ వర్కర్లు, కిషోర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకుని స్టేషన్ కు తరలించారు.

 


రోజూ పెరిగిపోతున్న కరోనా వైరస్ సమయంలోనూ ప్రభుత్వం మనిషికి మనిషి మధ్య భౌతికదూరం పాటించాలని సూచిస్తుంటే.. కొందరు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, వీరి వల్ల వ్యభిచార కేంద్రాలకు వెళ్లే కస్టమర్ల నుంచి వాళ్ల కుటుంబసభ్యులకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా వ్యభికేంద్రాలను నిర్వహస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: