గత శుక్రవారం తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులపై కాల్పులు జరిపి 8మంది పోలీసుల మృతికి కారణమైన హిస్టరీ షీటర్  వికాస్ దూబే సరిగ్గా వారం రోజులకు ఎన్కౌంటర్ లో హతమయ్యాడు. ఈరోజు ఉదయం పోలీసులు ,అతన్ని మధ్య ప్రదేశ్ నుండి  కాన్పూర్కు తీసుకువస్తున్న సమయంలో కాన్వాయ్ లోని ఓవాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఇదే అదునుగా భావించిన వికాస్ దూబే ,కానిస్టేబుల్ గన్ లాక్కొని తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. వాహనం బోల్తా పడడంతో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి అయితే ఈ ఎన్కౌంటర్ పై మాత్రం విపక్షాల నుండి విమర్శలు వస్తున్నాయి. స్క్రిప్ట్ ప్రకారమే వికాస్ దూబేను ఎన్కౌంటర్ చేశారని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. 
 
వికాస్ దూబేతో అధికార పార్టీ నేతలకు సంబంధాలు వున్నాయి దాంతో విచారణలో వారి గురించి చెపితే  ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉండడంతోనే బయపడి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, వికాస్ దూబే ను ప్లాన్ ప్రకారమే ఎన్కౌంటర్ చేయించాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు ఈ ఎన్కౌంటర్ ఫేక్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో యూపీ పోలీసులను ట్రోల్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: