కరోనా వైరస్.. ప్రపంచాన్ని ఎలా వణికిస్తోంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ను అంతమొందించేందుకు పరిశోధకులు రాత్రిపగళ్ళు వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నారు. మరోవైపు కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తూ వస్తుంది. ఇప్పటికే కోటి 25 లక్షలమందికి కరోనా వైరస్ వ్యాపించింది. 6 లక్షలమందిని బలితీసుకుంది. 70లక్షల మంది కరోనా నుండి కోలుకున్నారు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ ను ఈ చిట్కాతో తరిమికొట్టకపోతే రూ.50 వేలు రివార్డ్ ఇస్తాం అంటున్నాడు ఓ వ్యక్తి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అల్లాఉద్దీన్ అద్భుత దీపం చిట్కా అంటూ ఓ మెసేజ్ వాట్సాప్ లో తెగ ఫార్వార్డ్ అవుతుంది. ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే? ఆ చిట్కా పాటించిన కరోనా మాయం అవ్వలేదంటే 50 వేల రూపాయిలు రివార్డ్ ఇస్తాం అంటూ తెలిపారు. 

 

పూర్తి మెసేజ్ ఇలా ఉంది.. ''ముక్కులో ఒకచుక్క నిమ్మరసం వేసుకొంటే ముక్కులో, గొంతులో, శ్వాస కోశాల్లో దాగి ఉన్న కరోనా వైరస్ అంతా శ్లేష్మ రూపంలో నోటిలోనికి వచ్చేస్తుందట దాన్ని కాండ్రించి ఉమ్మివేయాలట. ఇక దీని తర్వాత గోరువెచ్చని నీటిలో ఉప్పు, నిమ్మరసం కలిపి పుక్కిలించి ఉమ్మలట. ఇలా చేసిన అనంతరం రిలీఫ్ గా ఉంటుందట. ఇంకా తర్వాత శుభ్రమైన కొబ్బరి నూనెలో వేలు ముంచి నాసికా రంధ్రాల్లో రాయాలట. ఈ విధంగా చేసిన తర్వాత మీకు రిలీఫ్ రాలేదని ఎవరైనా రుజువు చేస్తే వారికీ ఏకంగా 50 వేల రూపాయిలు రివార్డ్ ఇస్తాం అని ఛాలెంజ్ వేశారు. 

 

ఇంకా ఈ చిట్కాను కనుగొన్నా వ్యక్తి పేరు రంగా వెంకటేశ్వరరావు. ఈ చిట్కాతో కరోనా వైరస్ మాయం అవుతుందని.. ఇప్పటికే కొందరిపై ప్రయోగం చేసినట్టు అతను ఆ మెసేజ్ లో తెలిపారు.. అంతేకాదు శానిటైజర్ కన్నా గొప్పగా నిమ్మరసం పని చేస్తుందని.. నిమ్మరసం చేతులకు, శరీరానికి, తలకు, గదుల్లోను, బట్టలపై ఉపయోగిస్తే కరోనా మన దరి చేరదని చెప్తున్నారు. మరి ఈ మెసేజ్ లో నిజం ఎంతో తెలియదు గాని వాట్సాప్ లో మాత్రం తెగ షేర్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: