చైనా ప్రస్తుతం ప్రపంచ రెండవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా అన్ని దేశాలను తమ చెప్పు చేతుల్లోకి  తెచ్చుకునేందుకు.. ఎప్పుడూ సరికొత్త వ్యూహాలను పన్నుతూ  ఏదో ఒక విధంగా ప్లాన్ చేస్తూనే ఉంటుంది. దీనికోసం చైనా దేనికైనా తెగిస్తుంది అన్నది  ప్రపంచదేశాలకు ఇప్పటికే తెలుసు. అయితే చైనా కేవలం ఆర్థికంగా ప్రలోభ  పెట్టి వివిధ దేశాల ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడమే కాదు.. అమ్మాయిలను ఎర వేసి తద్వారా బ్లాక్ మెయిల్ చేసి పలు దేశాల అధికారులను నాయకులను లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తుంది అని ఎప్పటినుంచో టాక్  వుంది. అయితే తాజాగా ఇది నిజమే అని వెల్లడయ్యింది.



మామూలుగానే వ్యసనాలను అడ్డంపెట్టుకుని వ్యవహారం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది చైనా. కాగా ఇటీవలే  అమెరికా బ్రిటన్ దేశాలు చైనా కు సంబంధించిన వివిధ అంశాలపై విచారణకు ఆదేశాలు జారీ చేసిన  విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చైనా 5జీ  నెట్వర్క్ కి సంబంధించి చేసిన విచారణలో.. బ్రిటన్ మాజీ ఎమ్16 గూడచారి అందించిన నివేదికలో ఎన్నో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఈ క్రమంలోనే చైనా అమ్మాయిలను ఎర వేస్తుంది అన్నది కూడా వెల్లడైంది. చైనా  టెలికాం కంపెనీకి సంబంధించిన కార్యకలాపాలను మెరుగుపరుచుకునేందుకు.. బ్రిటన్ రాజకీయ నాయకుల దగ్గరకు అమ్మాయిల ఎరచూపి అందమైన అమ్మాయిలను వాళ్ళ దగ్గరకు పంపడం.. ఇలా రాజకీయ నాయకులతో సంబంధాలు మెరుగు పరుచుకోవటం చేసిందట.



అంతేకాకుండా చైనా అమ్మాయిలను పంపించి రాజకీయ నాయకులు అమ్మాయిలతో ప్రైవసీ గా ఉన్నటువంటి కొన్ని వీడియోలను దొంగచాటుగా రికార్డు చేసి వారిని బ్లాక్మెయిల్ చేసి.. తమకు కావాల్సిన అన్ని కార్యకలాపాలను చేయించుకున్నారు అన్నది  తాజాగా నివేదికలో వెల్లడయ్యింది.ప్రస్తుతం ఇదే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. దాదాపుగా అన్ని దేశాల్లో  చైనా ఇలాంటి వ్యూహాలే  అమలు చేస్తుంది అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న వాదన.  మరి ఈ విచారణ నివేదిక పై ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తారో  చూడాలి మరి.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: