ఇప్పటికే కరోనా వైరస్ సంక్షోభం.. ఈ సమయంలో పోలీసులకు దొరికితే ఉన్న డబ్బు మొత్తం పోతుంది... ఈ నేపథ్యంలోనే పోలీసులకు డబ్బులు దొరకకుండా డిజిటల్ చెల్లింపుల వైపు పేకాటరాయుళ్లు అడుగులు వేస్తున్నారు. సరికొత్త టెక్నాలజీని వాడుకుంటూ డిజిటల్ చెల్లింపులు చేస్తూ పేకాట ఆడుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం లోని పొట్టిలంక దగ్గర పౌల్ట్రీ ఫారం షెడ్లు కేంద్రంగా పేకాట రాయుళ్లు మకాం మార్చేశారు. ఎన్నో రోజుల నుంచి అక్కడ పేకాటరాయుళ్లు బృందాలుగా ఏర్పడి మరి పేకాట ఆడుతున్నారు.
ఈ క్రమంలోనే కీలక సమాచారం అందుకున్న పోలీసులు పేకాట శిబిరాలపై రైడ్ నిర్వహించి ఏకంగా 17 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. కానీ ఆశ్చర్యపోయారు.. ఎందుకంటే పేకాట స్థావరాలలో ఎలాంటి డబ్బులు దొరకలేదు. ఇదేంటి అని ఆరా తీస్తే పేకాటరాయుళ్ల సరికొత్త ఆలోచన బయటపడింది. వీళ్లంతా ఫోన్ పే గూగుల్ పే ద్వారా చెల్లింపులు చేసుకుంటున్నారట. అంతేకాదండోయ్ వీళ్లందరూ కలిసి ఒక రూల్ కూడా పెట్టుకున్నారట... ఎవరైనా పేకాట ఆడాలంటే వారి అకౌంట్లు 50 వేల నగదు ఉండాల్సిందే. అలా ఉంటేనే పేకాట ఆడటానికి అనుమతిస్తారట.
Powered by Froala Editor