ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ భయమే  కనిపిస్తున్న విషయం తెలిసిందే.. రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతుండడం... ఈ వైరస్కు ఎలాంటి వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాకపోవడంతో ఈ వైరస్ కు నివారణ ఒక్కటే మార్గం గా మారిపోయింది. ఈ నేపథ్యంలో మాస్క్ పెట్టుకోవడం శానిటైజర్ వాడటం మరియు భౌతిక దూరం పాటించడం అనివార్యంగా మారిన విషయం తెలిసిందే, ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఏ దేశంలో చూసిన ఎవరిని చూసినా ఇలా మాస్కు పెట్టుకుని దర్శనమిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మాస్కులు ధరించడం లేదు.



ఇక మాస్కు పెట్టుకోవాలి అని ఎవరైనా సూచిస్తే దారుణాలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా వెలుగులోకి వస్తోన్నాయి. తాజాగా ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది... మాస్కు పెట్టుకోవాలని ప్రయాణికులకు సూచించినందుకు  ఏకంగా బస్సు డ్రైవర్ ని ఇష్టం వచ్చినట్లు కొట్టి ప్రాణాలు తీశారు, మాస్కు పెట్టుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని సూచించిన పాపానికి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. ఫ్రాన్సులో జరిగింది ఈ దారుణ ఘటన. ఫ్రాన్స్ లోని.. 59 ఏళ్ల ఫిలిప్పే మంగీలాట్ బస్సు  డ్రైవర్ గా పని చేస్తున్నాడు, ఈ క్రమంలోనే సదరు వ్యక్తి నడుపుతున్న బస్సులో కి ముగ్గురు వ్యక్తుల ఎక్కారు.



వారూ ముఖాలకు మాస్క్ లు ధరించలేదు. దీంతో మాస్కులు ధరించవలసిందిగా వారికి డ్రైవర్ సూచించాడు, మాస్కు ధరించకపోతే ప్రాణాలకే ప్రమాదమని మాస్క్ ధరిస్తే కానీ బస్సును  ముందుకు కదలనివ్వను  అంటూ బస్సు ఆపేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ ముగ్గురు వ్యక్తులు బస్సులో ఉన్న ఓ ఇనుప రాడ్ తో డ్రైవర్ పై విచక్షణారహితంగా దాడి చేశారు. అయితే నిమిషాల వ్యవధిలోనే ఇది జరగడంతో ప్రయాణికులందరూ అవాక్కయ్యారు. ఇక డ్రైవర్ అపస్మారక స్థితిలోకి చేరుకోగానే ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. ఇక బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులు డ్రైవర్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు డ్రైవర్ ఫిలిప్పే. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.


Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: