ఎక్కడచూసిన  రోజురోజుకు దొంగ బాబాలు ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. ప్రజల అమాయకత్వాన్ని నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని బాబా  అవతారం ఎత్తుతున్నారు, పూజల పేరుతో భారీగా డబ్బులు దండుకుంటున్నారు. ఇలా దొంగ బాబాలను నమ్ముతున్న జనాలు కూడా ఎక్కువై పోతున్నారు. జనాల్ని బురిడీ కొట్టించడం.. ఏదో ఒక కారణంతో డబ్బులు దండుకోవడం అదేపనిగా ప్రస్తుతం ఎంతో మంది దొంగ బాబాలు పెద్ద వ్యాపారమే నడుపుతున్నారు. అయితే కేవలం జనాల నుంచి డబ్బులు దండుకోవడం వరకే ఆగడంలేదు కొంతమంది దొంగ బాబాలు... ఏకంగా వారి వద్దకు వచ్చిన మహిళలను వంచిస్తున్న దొంగబాబాలు ఎక్కువై పోతున్నారు. 

 


 గతంలో డేరాబాబా విషయం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బాబా ముసుగులో ఎంతోమంది యువతులపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ఏకంగా కటకటాలపాలయ్యాడు డేరా బాబా. తాజాగా ఇక్కడ మరో డేరా బాబా తెరమీదికి వచ్చాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక లో తాజాగా ఓ స్వామీజీ కామలీలలు బయటపడ్డాయి. డేరా బాబా గా మారిన వ్యక్తి  తన శిష్యుడితో కలిసి మహిళపై దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం గా మారిపోయింది. ఇటీవలే రఘు అనే వ్యక్తి సమర్థ మహారాజ్ అనే పేరుతో స్వామీజీగా అవతారమెత్తాడు... ఈ క్రమంలోనే సంతోషిమాత భక్తురాలైన ఓ మహిళ సదరు స్వామీజీ వద్దకు వచ్చి తాను సంతోషిమాత గుడి కట్టించాలని సంకల్పించినట్లు  విన్నవించింది. 

 

 భక్తురాలి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న దొంగ బాబా.. ఆమె పై కన్నేశాడు. లైంగిక వాంఛ తీర్చుకోవాలనుకొన్నాడు. ఈ క్రమంలోనే నీ సంకల్పం తీర్చేందుకు నేను నా శిష్యుడు రూపంలో మీ ఇంటికి వస్తాను... లైంగిక వాంఛను తీర్చితే నీ  సంకల్పం నెరవేరుతుంది అంటూ భక్తురాలికి మాయమాటలు చెప్పాడు. ఎన్నో  రోజుల పాటు ఆమెతో లైంగిక కోరికలు తీర్చుకొన్నాడు. రోజులు గడుస్తున్నాయి కానీ తన సంకల్పం  నెరవేరకపోవడంతో అనుమానం వచ్చిన బాధితురాలు బాబా గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో తాను మోసపోయానని గ్రహించి దుబ్బాక పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా దొంగ బాబా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: