ఈ మద్య చిన్న చిన్న విషయాలకు డిప్రెషన్ లోకి వెళ్లడం.. ఆత్మహత్యలు చేసుకోవడం సర్వసాధారణం అయ్యింది.  దేవుడు ఇచ్చిన ఈ జీవితానికి అర్థం పరమార్థం ఉంటుంది.. అలాంటిది క్షణికావేశానికి లోనై కొంతమంది బలవంతంగా తనువు చాలించుకుంటున్నారు. ఇది సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు సాగుతున్న తంతే.  ఈ మద్య బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ బాలీవుడ్ లో ఉన్న బంధుప్రీతి నేపథ్యంలో డిప్రేషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా ఎంతో మంది యువత తాము కోరుకున్నది దక్కలేదని... తాము ఏదీ సాధించలేకపోతున్నామని ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొంత మంది ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నారు.

 

తాజాగా నెల్లూరులో బీవీ నగర్ లో ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. సెల్ఫీ వీడియో అనంతరం ఆమె తనువు చాలించడం కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిల్చింది. ఉరి వేసుకోవడానికి ముందు ఆమె తన సెల్ఫీ వీడియోను.. నెల్లూరు బీవీ నగర్‌కు చెందిన శివభార్గవ్,  అతడి స్నేహితులు వాసు, సాయి కిరణ్ అనే మరో ఇద్దరికి సెల్ఫీ వీడియో పంపింది. తాను ఉరి వేసుకుంటున్నానని వారికి చెప్పింది. అయితే వారెవరూ ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు చెప్పలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

 

వారిలో ఏ ఒక్కరైనా కనీసం తమకు చెప్పినా ఈ ఘోరం జరిగేది కాదని వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటనపై మృతురాలి సోదరుడు మాట్లాడుతూ.. ‘మధ్యాహ్నం 12 గంటల సమయంలో మా అక్క ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో నేను, శివభార్గవ్ ఒకేచోట ఉన్నాం. కనీసం ఇలా సూసైడ్ చేసుకుంటుందనే విషయాన్ని కూడా వారు నాకు చెప్పలేదు. కొన్నిరోజులుగా తన సోదరి ఎంతో ఆవేదనగా.. ఒంటరిగా ఉంటూ వస్తుందని అన్నారు.  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: