ప్రేమ ఎంతటి దారుణానికైనా వడిగడుతుంది అనటానికి ఈ సంఘటన నిలువెళ్తూ నిదర్శనం. వారి ప్రేమ రెండు కుటుంబాలలో అగ్గి రాజేసింది. పిల్లల ప్రేమ వ్యవహారంలో ఓ కుటుంబం మొత్తం దారుణ హత్యకు గురైన ఘోర ఘటన కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

 

 

సింధనూరు పట్టణంలో శనివారం మధ్యాహ్నం సమయంలో యువతి, యువకుడు వీధి చివర చనువుగా మాట్లాడుకుంటూ కనిపించడంతో మళ్లీ గొడవ జరిగింది. ఊహించని ఘటనతో షాకైన ప్రేమికులు వెంటనే పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీశారు. వారి సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 

 

 

అయితే అప్పటికే ఫకీరప్ప కుటుంబం మారణహోమం సృష్టించిందని తెలిపారు. ఈరప్ప(60)తో పాటు అతడి కుటుంబంలోని నాగరాజ్‌(38), సుమిత్రమ్మ(55), శ్రీదేవి(30), హనుమేశ్‌(40)లను గొంతు కోసి దారుణంగా చంపేశారు. రక్తపు మడుగులో ఉన్న ఈరప్ప(60)ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రేవతి, తాయమ్మలను స్థానికులు రాయచూరు తరలించారని తెలిపారు. సింధనూరు టౌన్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారని తెలిపారు.

 

 

అయితే సింధనూరు పట్టణంలో ఇటీవల కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో వైరస్‌కు భయపడి ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. సింధనూరు చరిత్రలో ఇంతవరకూ ఇలాంటి దారుణం జరగలేదని స్థానికులు తెలిపారు. సుమారు 10ఏళ్ల కిందట స్థానిక టెలిఫోన్‌ కేంద్రం ఎదురుగా ఓ హోటల్‌ యజమాని కూతురిని ప్రేమోన్మాది పట్టపగలే గొంతుకోసి చంపేశాడు. ఆ భయానక ఘటనను తలుచుకుని పట్టణ ప్రజలు ఇప్పటికీ ఆందోళన చెందుతూ ఉంటారని సమాచారం.

 

 

ఇలాంటి సమయంలోనే శనివారం ఏకంగా ఓ కుటుంబంలోని ఐదుగురిని గొంతు కోసి చంపేశారన్న వార్త తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనకు కారణమైన ప్రేమజంట ప్రస్తుతం పోలీస్‌స్టేషన్లో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంది. వారిపై ఎవరూ దాడికి పాల్పడకుండా పోలీసులు రక్షణ కల్పించారు. వీరి సమస్యను రెండు కుటుంబాలు కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోయేదని పోలీసులు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: