ఈరోజుల్లో  బంధాలకు బంధుత్వాలకు విలువ లేకుండా పోతుంది అన్న విషయం  తెలిసిందే.  క్షణికావేశంలో  ఏకంగా ప్రాణాలను సైతం తీసేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కడతెరుస్తున్న ఘటన ఘటనలు చాలానే తెరమీదకి వచ్చాయి. తాజాగా ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. మద్యానికి బానిసైన తన కొడుకు ప్రవర్తనతో విసిగి పోయిన ఓ తల్లి తన మనసును కఠినం చేసుకుని ... కసాయిగా మారిపోయింది.  ఏకంగా కొడుకునే దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా సంచలనం సృష్టించింది.



 కడదాకా కొడుకుని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన కన్నతల్లి.. కిరాతకంగా కొడుకును హత్య చేసిన అమానుష ఘటన తో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కిపడింది. విశాఖపట్నం జిల్లాలో జరిగింది ఈ దారుణ ఘటన. అక్కయ్యపాలెం మండలం రామచంద్ర నగర్ కు చెందిన అశోక్ వర్మ, తల్లి వరలక్ష్మి అక్క బావ తో కలిసి నివసిస్తూన్నారు. అశోక్ రాడ్ వెల్డర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కానీ ప్రస్తుతం కరోనా  వైరస్ నేపథ్యంలో ఎలాంటి పని లేకపోవడంతో ప్రతి రోజు మద్యం తాగడం మొదలు పెట్టాడు.


ఈ క్రమంలోనే  తాగుడుకు బానిసయ్యాడు. కేవలం తాగి ఊరుకోకుండా నిత్యం అక్క చెల్లి తో గొడవ పడేవాడు అశోక్ వర్మ. ఈ క్రమంలోనే శనివారం ఫుల్ గా తాగి వచ్చిన అశోక్ వర్మ మద్యం మత్తులో తన సోదరి తో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదం తీవ్రమైంది. ఇంట్లోనే ఉన్న తల్లి కొడుకు తీరుతో ఎంతగానో విసిగి  పోయింది. దీంతో పక్కనే ఉన్న రోకలిబండతో కొడుకు తలపై కొట్టింది. దెబ్బ బలంగా తగలడంతో అశోక్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపుమడుగులో ప్రాణాలు వదిలాడు అశోక్ . ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి తల్లి ని అదుపులోకి తీసుకున్నారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: