కడుపులో ఉన్నప్పటి నుంచే  కంటికి రెప్పలా కాచుకుని... తన ఊపిరి తో మనకు ఊపిరి పోస్తుంది అమ్మ. తన శరీరానికి గాయం అయినప్పుడు కీ ఎంతో సంతోషంగా జన్మనిస్తుంది అమ్మ . ప్రాణాలను పణంగా పెట్టి అయిన పిల్లలను కాపాడుకుంటుంది. ఏ చిన్న సమస్య వచ్చినా తల్లడిల్లిపోతుంది. తాను  ఎన్ని బాధలు అనుభవించినప్పటికీ ఎప్పుడు పిల్లల సంతోషం కోసమే ఆరాట పడుతూ ఉంటుంది అమ్మ. అందుకే తల్లి ప్రేమను మాటల్లో వర్ణించలేము అని చెబుతూ ఉంటారు. తాజాగా  ఇక్కడొక తల్లి.. 65 ఏళ్ల వయసులో తన ప్రాణాలను పణంగా పెట్టి 38 ఏళ్ళ కొడుకుకి  పునర్జన్మనిచ్చింది. తన కిడ్నీ దానం చేసి కొడుకును బతికించుకుంది ఆ  తల్లి. బంగ్లాదేశ్కు చెందిన తల్లి కుమారుడు  ఇద్దరూ కోల్కతా లో ఉంటున్నారు. అయితే కుమారుడు ఎన్నో ఏళ్ల నుంచి కిడ్ని సమస్యతో బాధపడుతున్నాడు.



ఇక ఇటీవలే కరోనా  వైరస్ బారిన కూడా పడ్డాడు సదరు వ్యక్తి. ఇక ఇప్పటికే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తన కుమారుడికి కరోనా  కూడా సోకడంతో ఆ తల్లి మనస్సు మరింత తల్లడిల్లిపోయింది. ఇక తల్లికి కూడా పాజిటివ్ అని రావడంతో తల్లి కుమారులు ఇద్దరు కరోనా చికిత్స తీసుకోని.. కోలుకున్నారు.  ఇద్దరికీ జూన్ 12వ తేదీన పరీక్షలు నిర్వహిస్తే  నెగటివ్ అని నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తన కుమారుడి బాదను తొలగించేందుకు 65 ఏళ్ల వయసులో కూడా తల్లి ప్రేమను చాటింది ఆ వృద్ధురాలు.



తన కిడ్నీ లలోంచి  ఒక కిడ్నీని దానం చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే ఇటీవలే కరోనా వైరస్ బారి నుంచి కోలుకోవడంతో వైద్యులు మరో రెండు వారాల పాటు క్వారంటైన్ లో  ఉంచిన తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ నిర్వహించారు. అయితే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ విజయ వంతంగా పూర్తయినట్లు వైద్యులు తెలిపారు. కాగా కరోనా  వైరస్ బారి నుంచి కోలుకున్న తర్వాత ఇలా ఆపరేషన్ చేయడం ఇదే మొదటిసారి అని వైద్యులు చెప్పుకొచ్చారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: