ఇక ఇటీవలే కరోనా వైరస్ బారిన కూడా పడ్డాడు సదరు వ్యక్తి. ఇక ఇప్పటికే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తన కుమారుడికి కరోనా కూడా సోకడంతో ఆ తల్లి మనస్సు మరింత తల్లడిల్లిపోయింది. ఇక తల్లికి కూడా పాజిటివ్ అని రావడంతో తల్లి కుమారులు ఇద్దరు కరోనా చికిత్స తీసుకోని.. కోలుకున్నారు. ఇద్దరికీ జూన్ 12వ తేదీన పరీక్షలు నిర్వహిస్తే నెగటివ్ అని నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తన కుమారుడి బాదను తొలగించేందుకు 65 ఏళ్ల వయసులో కూడా తల్లి ప్రేమను చాటింది ఆ వృద్ధురాలు.
తన కిడ్నీ లలోంచి ఒక కిడ్నీని దానం చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే ఇటీవలే కరోనా వైరస్ బారి నుంచి కోలుకోవడంతో వైద్యులు మరో రెండు వారాల పాటు క్వారంటైన్ లో ఉంచిన తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ నిర్వహించారు. అయితే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ విజయ వంతంగా పూర్తయినట్లు వైద్యులు తెలిపారు. కాగా కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్న తర్వాత ఇలా ఆపరేషన్ చేయడం ఇదే మొదటిసారి అని వైద్యులు చెప్పుకొచ్చారు.
Powered by Froala Editor