మామూలుగా అయితే  క్రికెట్ పైన ఎక్కువగా బెట్టింగులు జరుగుతూ ఉంటాయి అన్న విషయం అందరికి తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఏ అభ్యర్థికి గెలుస్తాడు అన్న దానిపై కూడా బెట్టింగులు  పెట్టడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపుతారు. కొంతమంది సినిమా విడుదల తర్వాత హిట్టా.. ఫట్టా  అనే దానిపై కూడా బెట్టింగులు పెడుతుంటారు. ఇలా బెట్టింగుల్లో భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ ఇప్పుడు లేవాయే.. కరోనా  వైరస్ కారణంగా ఎలాంటి క్రికెట్ మ్యాచ్ లు  జరగడం లేదు... సినిమాలు విడుదల కావడం లేదు.. ఇక రాజకీయాలు అంతా సైలెంట్ గా మారిపోయాయి. ఇలాంటి సంక్షోభం సమయంలో బెట్టింగ్ బాబులు మాత్రం సరికొత్తగా ఆలోచించారు.



ఏకంగా కరోనా  వైరస్ పై బెట్టింగ్ పెట్టడం మొదలుపెట్టారు. కరోనా  మీద బెట్టింగ్ ఏంటి అని ఆశ్చర్యం వేస్తుంది కదా... కానీ ప్రస్తుతం కర్ణాటకలో ఇదే జరుగుతున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ కేసులపై కొంతమంది బెట్టింగ్ బాబులు బెట్టింగ్ వేస్తూ  కరోనా ను కూడా క్యాష్ చేసుకుంటున్నారట. కర్ణాటకలో ఏ ప్రాంతం లో ఎన్ని కేసులు వెలుగులోకి వస్తాయి అనే దానిపై కొంతమంది బెట్టింగ్ బాబులు బెట్టింగ్ కాస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తున్నారట. ప్రతిరోజు ప్రభుత్వం నుంచి కరోనా  హెల్త్ బులిటెన్ విడుదల కాగానే.. ఓడిపోయిన వారు గెలిచిన వారికి నగదును ట్రాన్స్ఫర్ చేసుకున్నారట.



 ఇక ఇలాంటి బెట్టింగులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి అని పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా  కర్ణాటకలోని పాత మైసూరు, చామరాజనగర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో ఇలాంటి బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి అని సమాచారం. ఈ బెట్టింగ్ లు కూడా వెయ్యి రూపాయలకు పైనే పెడుతున్నారట... ఈ విషయం పోలీసుల వరకు వెళ్లినా  చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి, ఏదేమైనా కరోనా  వైరస్ వ్యాప్తితో  ఆందోళన చెందాల్సింది పోయి... కరోనా వైరస్ పైనే  బెట్టింగ్ లు పెట్టి క్యాష్ చేసుకుంటున్నారు అంటే బెట్టింగ్ బాబులు  ఎంత దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: