ఏకంగా కరోనా వైరస్ పై బెట్టింగ్ పెట్టడం మొదలుపెట్టారు. కరోనా మీద బెట్టింగ్ ఏంటి అని ఆశ్చర్యం వేస్తుంది కదా... కానీ ప్రస్తుతం కర్ణాటకలో ఇదే జరుగుతున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ కేసులపై కొంతమంది బెట్టింగ్ బాబులు బెట్టింగ్ వేస్తూ కరోనా ను కూడా క్యాష్ చేసుకుంటున్నారట. కర్ణాటకలో ఏ ప్రాంతం లో ఎన్ని కేసులు వెలుగులోకి వస్తాయి అనే దానిపై కొంతమంది బెట్టింగ్ బాబులు బెట్టింగ్ కాస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తున్నారట. ప్రతిరోజు ప్రభుత్వం నుంచి కరోనా హెల్త్ బులిటెన్ విడుదల కాగానే.. ఓడిపోయిన వారు గెలిచిన వారికి నగదును ట్రాన్స్ఫర్ చేసుకున్నారట.
ఇక ఇలాంటి బెట్టింగులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి అని పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కర్ణాటకలోని పాత మైసూరు, చామరాజనగర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో ఇలాంటి బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి అని సమాచారం. ఈ బెట్టింగ్ లు కూడా వెయ్యి రూపాయలకు పైనే పెడుతున్నారట... ఈ విషయం పోలీసుల వరకు వెళ్లినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి, ఏదేమైనా కరోనా వైరస్ వ్యాప్తితో ఆందోళన చెందాల్సింది పోయి... కరోనా వైరస్ పైనే బెట్టింగ్ లు పెట్టి క్యాష్ చేసుకుంటున్నారు అంటే బెట్టింగ్ బాబులు ఎంత దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు.
Powered by Froala Editor