హైదరాబాద్ లోని సంతోష్ నగర్ లో నిన్న రాత్రి జరిగింది ఈ విషాద ఘటన. వివరాల్లోకి వెళితే... సంతోష్ నగర్ లోని ఖలందర్ నగర్ లో నివాసముంటున్న సయ్యద్ సాదిక్ అలీ అనే యువకుడు కోవిడ్ 19 కాల్ సెంటర్ లో పని చేస్తున్నాడు, అయితే గత కొంతకాలంగా జ్వరం దగ్గు తో బాధపడుతున్నాడు సాదిక్ అలీ. ఈ క్రమంలోనే చికిత్స కోసం క్లినిక్ వెళితే కరోణ నిర్ధారిత పరీక్షలు చేయించుకోవాలని అక్కడ సిబ్బంది సూచించారు. కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో అప్పటికే తీవ్ర మనస్తాపం చెందిన యువకుడు.. క్లినిక్ వెళ్ళిన పరీక్షలు చేయించుకోవాలని చెబుతుండడంతో మరింత కుంగిపోయాడు. దీంతో తనకి కరోనా సోకిందేమో అని తీవ్ర ఆందోళన చెందాడు.
ఇక ఈ జీవితం వృధా అనుకొని క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఎవరూ లేని సమయంలో గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Powered by Froala Editor