వివరాల్లోకి వెళితే... పటౌడీ లోని నాన్కువాన్ గ్రామానికి చెందిన ప్రియాంక రాజేష్ మధ్య ఎన్నో ఏళ్లుగా సాన్నిహిత్య సంబంధం ఉంది . రాజేష్ కు వివాహం జరిగి ముగ్గురు పిల్లలు ఉండగా ప్రియాంకకు... ఇటీవల జూన్ 29న వివాహం జరిగింది. అయితే ఇటీవలే ప్రియాంక తన తల్లిదండ్రుల ను చూడడానికి నాన్కువాన్ గ్రామానికి వచ్చింది. ఈ క్రమంలోనే ప్రియాంక ఊళ్లోకి వచ్చిన విషయం తెలుసుకున్న రాజేష్ ప్రియాంకను తీసుకునే సమీప దాబా వద్దకు తీసుకెళ్లాడు. ఇక ప్రియాంక ఆ తర్వాత ఇంటికి వెళ్ళలేదు.
దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా... గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు దాబా వద్ద కాళీ ప్రదేశంలో రెండు మృతదేహాలు కనిపించాయి. దీంతో వెంటనే ప్రియాంక కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఆ మృతదేహం ప్రియాంక దే అని గుర్తించారు. అటు పక్కనే కనిపించిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రియాంకను తుపాకీతో కాల్చి అనంతరం రాజేష్ తనని తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.
Powered by Froala Editor