ఈ మధ్యకాలంలో భార్యాభర్తల బంధానికి విలువ లేకుండా పోతుంది. కడదాక తోడుంటామని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న  వాళ్లే... కట్టుకున్న వారిని కడ  తేరుస్తున్నారు. వివిధ కారణాలతో కట్టుకున్న వారిని కడతేరుస్తూ కాటికి పంపిస్తున్న ఘటనలు ఈ రోజుల్లో ఎక్కువైపోతున్నాయి. భార్య భర్తల మధ్య తలెత్తిన చిన్న చిన్న  వివాదాల కారణంగా హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా చంపి అడవిలో పడేసాడు భర్త. ఆ తర్వాత దొంగ నాటకానికి తెరలేపాడు. 

 

 ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలంలో వెలుగులోకి వచ్చింది. బాన్సువాడ మండలానికి చెందిన సావిత్రికి వర్ని మండలానికి చెందిన బాలరాజు తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటికే బాలరాజుకు మరో మహిళతో వివాహం జరుగగా మనస్పర్థల కారణంగా ఆ ఇద్దరు విడిపోయారు. సావిత్రి ని రెండో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ళకి వీరిద్దరికీ కూతురు పుట్టింది, ఇక ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవారు, దీంతో విసిగిపోయిన సావిత్రి తన భర్త, మామ పై  గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేస్తూ పంచాయతీ పెట్టించింది. గ్రామ పెద్దల ముందు తన భార్య పరువు తీసిందని  తీవ్రత కోపోద్రిక్తుడైన బాలరాజు.. భార్యను హతమార్చాడని నిర్ణయించుకున్నాడు. 

 

 ఈ క్రమంలోని భర్త బాలరాజు తండ్రి  సాయిలు కలిసి సావిత్రి ని తీసుకొని బీడీ ఆకులు తీసుకురావడానికి అడవిలోకి వెళ్లారుమ్ అక్కడే ఇద్దరు సావిత్రిని  గొంతు నులిమి చంపేసి శవాన్ని ఎవరికీ కనిపించకుండా పొదల్లో పడేసి వచ్చారు. ఆ తర్వాత దొంగ నాటకాలకు తెరలేపిన బాలరాజు తన భార్య కనిపించడం లేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఇక బాలరాజు తీరుపై కాస్త అనుమానం వచ్చిన పోలీసులు పోలీస్ స్టేషన్కు పిలిపించి తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు బాలరాజు. ఇక నిందితుడిని ఘటన  స్థలానికి తీసుకెళ్లి సావిత్రి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని హాస్పిటల్కు తరలించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: