మనం ఒకటి తలిస్తే వీధి ఒకటి తలుస్తుంది అని అంటూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు చిన్నారుల ఆనందాన్ని చూసి ఓర్వలేని విధి అభం శుభం తెలియని చిన్నారులు ప్రాణాలు సైతం తీస్తుంటుంది. తాజాగా ఇలాంటి ఓ విషాదకర ఘటన జరిగింది. పాల ప్యాకెట్ కోసం దుకాణానికి వెళ్లిన చిన్నారి... అటు నుంచి అటే పరలోకాలకు వెళ్ళిపోయింది. ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని నింపింది. హృదయాన్ని  కలచి వేసే ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా మండపేట లో జరిగింది. 

 

 వివరాల్లోకి వెళితే.. మండపేట లో నివాసముంటున్న పలివేల ప్రసాద్ పల్లవి దంపతులకు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు.7 ఏళ్ళ  కుమార్తె సూర్యచంద్రకళ పాల ప్యాకెట్ కోసం దుకాణానికి వెళ్ళింది. నవ్వుకుంటూ వెళ్లి పాల ప్యాకెట్ తీసుకొని ఇంటికి వస్తున్న క్రమంలో... ఆ చిన్నారి ఆనందాన్ని చూసి విధి  ఓర్వ లేక పోయింది. డ్రైనేజ్ రూపంలో ఆ చిన్నారిని మృత్యువు కబళించింది. తిరిగి వస్తున్న క్రమంలో ఆ చిన్నారి వేసుకున్న చెప్పు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న డ్రైనేజి లోకి వెళ్ళింది ఆ చిన్నారి చెప్పు. కాగా అక్కడ ప్రమాదం పొంచి ఉంది అని అర్థం చేసుకోలేక పోయింది ఆ చిన్నారి. 

 


 చెప్పు  కోసం వెళ్లి ప్రమాదవశాత్తు సూర్య చంద్రకళ డ్రైనేజీ లో పడిపోయింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో స్థానికులు ఆ చిన్నారి డ్రైనేజ్ లో పడిపోయింది అని గుర్తించే  లోపే చాలా దూరం కొట్టుకుపోయింది ఆ చిన్నారి. ఇక వెంటనే స్థానికులు ఆ చిన్నారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే సమయం దాటిపోయింది. ఆ చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. అయితే అప్పుడు వరకు తమ కళ్లముందే తిరిగిన అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు కానరాని లోకాలకు వెళ్లిపోయిందని  తల్లిదండ్రులు  విలపిస్తున్న తీరు  స్థానికులు అందరినీ కన్నీరు పెట్టించింది . ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: