ఈ మధ్య కొంత మంది మనుషులు రాక్షసుల కన్నా ఘోరంగా తయారవుతున్నారు. ఇటీవల కేరళలో నిండు గర్భంతో ఉన్న ఏనుగు ప్రాణాలు పోవడానికి కారకులు అయ్యారు. అది తిన్న పదార్థంలో బాంబు పెట్టడంతో నోరు పేలిపోయి పధ్నాలుగు రోజుల పాటు అవస్థలు తీసి చనిపోయింది. ఆ తర్వాత ఓ కుక్క నోటికి ప్లాస్టర్ చుట్టడంతో వారం రోజుల పాటు ఆకలితో అలమటించి పోయింది.  మొత్తానికి డాగ్స్ కేర్ వారు దానికి ట్రీట్ మెంట్ ఇప్పించారు. ఆ మద్య ఓ ఆవు తినే గడ్డిలో బాంబ్ అమర్చడంతో దాని నోరు పేలిపోయింది.  ఇలా మూగ జీవాలను దారుణంగా చంపడానికి కారణం కొంత మంది పైశాచిక ఆనందమే కారణం అని అంటున్నారు. ఏది ఏమైనా వణ్య మృగాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరీకీ ఉందని జంతు ప్రేమికులు అంటున్నారు.  

 

ఆ మద్య కొంత మంది టిక్ టాక్ కోసం అడవుల్లో మూగ జీవాలను దారుణంగా హింసిస్తూ.. చంపడం చూశాం. ఇక వ‌న్య‌ప్రాణుల‌ను చంపి సోష‌ల్ మీడియాలో పెట్ట‌డం ఫ్యాష‌న్‌గా మారిపోయింది. అది తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేయ‌డం. ఇదంతా కామ‌న్‌గా అయిపోయింది. అయిన‌ప్ప‌టికీ ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. తెలంగాణ‌లోని మెద‌క్ జిల్లాకు చెందిన ఓ కుర్రాడు, రాకాసి బల్లి.. ఉడుము అదేనండి మానిట‌ర్ లిజ‌ర్డ్‌ను కోడిని కాల్చిన‌ట్లు కాల్చుకుని తిన్నాడు.

 

తాము చేస్తున్నది ఏదో గొప్ప అన్నట్టుగా ఈ ఘనకార్యం  ఈ వీడియో తీసి సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేశారు.  ఇది కాస్త వైర‌ల్ అయి పోలీసుల కంట ప‌డింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ బ‌ల్లిని వ‌న్య‌ప్రాణిగా గుర్తించారు. మానిట‌ర్ లిజ‌ర్డ్‌ని అమ్మినా, చంపినా ఏడేండ్లు జైలు శిక్ష త‌ప్ప‌ద‌న్నారు. ఈ కుర్రాడితోపాటు ఉన్న మ‌రో ఇద్ద‌రి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: