దేశంలో మార్చి నెల నుంచి కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం.  అప్పటి నుంచి జనసందోహంగా ఉండే ప్రతి ఒక్కటీ మూసి వేశారు. అందులో దేవాలయాలు కూడా ఉన్నాయి. దాదాపు రెండు నెలల చిన్నా.. పెద్ద దేవాలయాలు మొత్తం మూసి వేశారు. ప్రపంచంతో గొప్ప పుణ్య క్షేత్రంగా వెలిగిపోతున్న తిరుమల కూా మూసివేశారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తో టీటీడీ ఛైర్మన్, వైఎస్సాఆర్ సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఈరోజు భేటీ అయ్యారు.  ఈ సందర్భంగా సుబ్బారెడ్డి లాక్ డౌన్ కారణంగా టీడీడీ ఆదాయం గణనీయంగా పడిపోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు.

 

పెద్ద నోట్ల రద్దుతో రూ. 50 కోట్ల విలువైన పాత నోట్లు టీటీడీ వద్దే ఉండిపోయాయని... ఈ పాత నోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేయాలని విన్నవించారు.  స్వామి వారికి భక్తులు ఇచ్చే కానుకలను డబ్బు రూపంలోకి మార్చుకునేందుకు అనుమతించాలని సుబ్బారెడ్డి కోరారు.  ఈ నేపథ్యంలో కష్టాల్లో ఉన్న టీటీడీని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పెద్ద నోట్ల రద్దుతో రూ. 50 కోట్ల విలువైన పాత నోట్లు టీటీడీ వద్దే ఉండిపోయాయని... ఈ పాత నోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేయాలని విన్నవించారు. 

 

ఇదే సమయంలో రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు, పోలవరం ప్రాజెక్టుకు వెంటనే నిధులను విడుదల చేయాలని విన్నవించారు. ఇటీవలే ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన కూడా కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ అయిన విషయం తెలిసిందే.  స్వామి వారికి భక్తులు ఇచ్చే కానుకలను డబ్బు రూపంలోకి మార్చుకునేందుకు అనుమతించాలని సుబ్బారెడ్డి కోరారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: