ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన రాష్ట్రంలో ఉన్న పేదలకు సామాన్యులకు నడుపుతున్న గానీ పార్టీలో కొంతమంది నేతలకు నచ్చటం లేదు. అది కూడా 2019 ఎన్నికల టైంలో లాస్ట్ మినిట్ లో పార్టీలో వచ్చిన నేతలకి. అనగా జంపింగ్ జపాంగ్ లకు. ఆ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు నరసాపురం ఎంపీ. ఇప్పటికే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు భారీ స్థాయిలో వైఎస్ జగన్ సర్కార్ ను ఇరుకున పెట్టడానికి అనేక రీతులుగా వివిధ పార్టీల నేతలతో కలుస్తూ జగన్ తో ఢీ అంటే ఢీ అనే విధంగా వ్యవహరిస్తున్నారు.

IHG

ఇలాంటి తరుణంలో రఘురామకృష్ణంరాజు తో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి తోడైనట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ ఏడాది పరిపాలన టైములో ఆనం రాంనారాయణ రెడ్డి బహిరంగంగానే జగన్ నాయకత్వంపై విమర్శలు చేయడం జరిగింది. ఆ సంతృప్తికరంగానే ఆనం కామెంట్లు చేయడంతో అప్పట్లో వార్తల్లో ఆనం రామనారాయణ రెడ్డి పెద్ద హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఇటీవల రఘురామ కృష్ణంరాజు మరియు ఆనం ఇద్దరూ కలిసి సెల్ఫీ దిగడం తో ఏపీ రాజకీయాల్లో వైరల్ గా ఈ సెల్ఫీ మారింది.

Single selfie giving shivers to IHG Party? | TeluguBulletin.com

ఇద్దరూ కలిసి జగన్ ప్రభుత్వం పై తిరుగుబాటు చేయడానికి రెడీ అవుతున్నట్లు ఫోటో చూసి చాలామంది నేతలు అభిప్రాయపడుతున్నారు. కొసమెరుపు ఏమిటంటే రఘురామకృష్ణంరాజు మరియు ఆనం రాంనారాయణ రెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహితులుగా పేరు ఉంది. అటువంటిది వీరిద్దరూ ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయాలి అన్నట్లు వ్యూహాలు వేస్తున్నట్లు వార్తలు రావటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: