ఈ మధ్య కాలంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. మహిళలు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో విధంగా కామాంధుల కోరల్లో చిక్కుకుంటూనే ఉన్నారు . ఎన్ని కటిన చట్టాలు తీసుకొచ్చినా కామంతో ఊగిపోతున్న కామపిశాచుల్లో  మార్పు మాత్రం రావడం లేదు. దీంతో రోజురోజుకు మనుషుల ముసుగులో ఉన్న కామాంధుల బారినపడి ఆడపిల్లల బతుకులు చితికి పోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన జరిగింది ఇక్కడ. ఓ కామాంధుడు ఓ బాలికపై అత్యాచారం చేశాడు... ఇక ఊరు వాళ్ళందరూ రెండు లారీలలో నిందితున్ని  తీసుకొచ్చి  పోలీసులకు అప్పజెప్పారు. కేసు నమోదు చేసుకొని ఊరి వాళ్లందర్నీ వెనక్కి పంపించేశారు పోలీసులు.



 కానీ ఈ క్రమంలోనే మెరుపువేగంతో ఆ నిందితుడు తప్పించుకోవడం సంచలనంగా మారింది. కానీ అంతలోనే ట్రక్కు కింద పడి ప్రాణాలు వదిలాడు నిందితుడు . ఈ ఘటన ఒడిశాలోని రాయగడ ప్రాంతంలో చోటు చేసుకుంది. రాయగడ ప్రాంతానికి చెందిన ఓ బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు అత్యాచారం చేశాడు. దీంతో అప్పటికే ఆ యువకుడిని చితకబాదిన గ్రామస్తులు... భారీ సంఖ్యలో తరలివచ్చి ఆ యువకున్ని  పోలీసులకు అప్పగించారు. ఇక ఫార్మాలిటీస్ ప్రకారం పోలీసులు బాలిక దగ్గర్నుంచి స్టేట్మెంట్ తీసుకుని కేసు నమోదు చేసుకుని... గ్రామం నుంచి తరలివచ్చిన భారీ జనాన్ని వెనక్కి పంపించేశారు.



ఈ క్రమంలోనే పోలీసులు అందరూ టీ తెప్పించుకొని తాగుతున్నారు. నిందితుడు అక్కడే ఒక మూలన కూర్చున్నాడు. అయితే పోలీసులు టీ తాగుతున్న సమయంలోనే వారి కళ్లు గప్పి క్షణాల్లో పోలీస్ స్టేషన్ నుంచి పరారయ్యాడు నిందితుడు. పారిపోకు అని పోలీసులు బెదిరించినప్పటికి కూడా వెనక్కి తిరిగి చూసుకుంటూ అలాగే పరుగులు పెట్టాడు నిందితుడు. దీంతో అలాగే వెనక్కి చూస్తూ పరుగులు పెడుతున్న సమయంలో రోడ్డు పైకి చేరుకోగానే వేగంగా వచ్చిన ఓ ట్రక్కు... ఆ కుర్రాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ చక్రాల కింద పడ్డాడు కుర్రాడు. ఇది గమనించిన పోలీసులు హుటాహుటిన నిందితుని పోలీస్ వెహికిల్ లో  ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నిందితుడు చనిపోయాడు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: