ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో సోమవారం ఒక్క రోజే 11,525 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని పేర్కొన్నారు. దేశంలో కరోనా మరణాల రేటు 2.7 శాతం ఉంటే.. తెలంగాణలో ఒక్క శాతమే ఉందన్నారు. తెలంగాణలో 365 మంది కరోనాతో మరణించారని వెల్లడించారు.  లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత వైరస్‌ వ్యాప్తి పెరుగుతోందని చెబుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణలో కరోనా టెస్టులు, చికిత్స తీరుతెన్నులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మద్యనే ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా చికిత్స చేయించుకున్న వారికి భారీ ఎత్తున బిల్లులు వేస్తున్న విషయం తెలిసిందే.

 

దాంతో కొన్ని ఆసుపత్రులపై ప్రభుత్వం కొరడా ఝులిపించింది. తాజాగా గాంధీ ఆసుపత్రిలో కరోనా టెస్టులు చేయకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.  ఈ నేపథ్యంలో సామాన్యులపై భారం పడకుండా గాంధీ ఆసుపత్రిలోనూ కరోనా టెస్టులు జరపాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.  కేంద్రం కల్పించిన అధికారాలతో ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించాలని స్పష్టం చేసింది.

 

కరోనా రోగుల నుంచి రూ.4 లక్షలకు పైగా బిల్లులు వసూలు చేసిన యశోద, కిమ్స్ ఆసుపత్రులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇక నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేస్తారా? లేదా? అనే అంశంలో ఈ నెల 27 లోగా పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అంతే కాదు ప్రైవేటు ల్యాబ్ ల్లో అన్నిరకాల పరీక్షలకు గరిష్ఠ చార్జీలు ఖరారు చేయాలని సూచించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: