కర్ణాటక రాష్ట్రంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసు వివరాలను కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ బులిటెన్ ద్వారా విడుదల చేసింది. ఇక హెల్త్ బులిటెన్ చూస్తే... నేడు ఏకంగా 2496 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు 44077 కు చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 25,839 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. ఇందులో 540 మంది పరిస్థితి సీరియస్ గా ఉండడంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

 

 

ఇక మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నేడు 1142 మంది ఆసుపత్రుల నుండి సంపూర్ణ ఆరోగ్య డిశ్చార్జ్ అయ్యారు. దీంతో నేటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 17390 కు చేరుకుంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 87 మంది కరోనా బారినపడి మృత్యువాత పడ్డారు. దింతో నేటి వరకు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 842 కు చేరుకుంది.

IHG

 

ఇక మరోవైపు బెంగళూరు మహా నగరంలో నేడు 1267 కేసులు నమోదయ్యాయి. దీంతో బెంగళూరు నగరంలో ఇప్పటివరకు 20969 కేసులు నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: