భారత్-చైనా మధ్య కొనసాగుతున్న గొడవల మధ్య చైనా ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. భార‌త్ భూభాగాన్ని ఆక్ర‌మించుకునేందుకు కవ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతున్న చైనాకు చెక్ పెట్టేందుకు కేంద్రం పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రిని ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేయ‌నుంది. త‌ద్వారా చైనాకు ఊహించ‌ని షాక్ ఇచ్చింది.

 

బాలకోట్ వైమానిక దాడుల తరువాత  అత్యవసర ఆర్థిక అధికారాల కింద గ‌తేడాది పెద్ద సంఖ్య‌లో క్షిపణులు మరియు లాంచర్లు కొనుగోలు చేసింది. ఎమ‌ర్జెన్సీ ఫైనాన్షియ‌ల్ ప‌వ‌ర్స్ కింద సుమారు రూ.500కోట్ల‌తో 12 స్పైక్ లాంచ‌ర్ యూనిట్లు, 200కి పైగా క్షిప‌ణిలను పంపించాల‌ని ఇండియన్ ఆర్మీకి చెందిన ఉన్న‌తాధికారులు ఇజ్రాయిల్ ను కోరిన‌ట్లు స‌మాచారం. ఇండియ‌న్ ఆర్మీ ఇజ్రాయిల్ నుంచి స్పైక్ ట్యాంక‌ర్లు, యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిప‌ణిల‌ను కొనుగోలు చేయ‌డానికి సిద్ధంగా ఉంది. స‌రిహ‌ద్దు ప్రాంతాల్ని మ‌రితం బ‌లోపేతం చేసేందుకు కేంద్రం అమ్మ‌ల‌పొదిలో అస్త్రాల్ని సిద్ధం చేసుకుంటుంది. ఈ క్షిప‌ణుల‌ను పాకిస్తాన్ ముందు భాగంలో మొహ‌రించ‌గా.. తాజాగా రూ.500కోట్ల‌తో ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేయ‌నున్న క్షిప‌ణుల‌ను చైనా భూభాగం ముందు భార‌త భూభాగంలో ఏర్పాటు చేయ‌నుంది.

 

ఇరాన్ పర్యటన సందర్భంగా 2016 లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ చాబహర్ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ మొత్తం ప్రాజెక్టుపై సుమారు 6 1.6 బిలియన్లు పెట్టుబడి పెట్టాలి. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి భారతదేశం నుంచి ఇంజనీర్లు కూడా ఇరాన్‌కు వెళ్లారు. అయితే, అమెరికా ఆంక్షల భయంతో భారత్ రైలు ప్రాజెక్టు పనులను ప్రారంభించలేదు. చైనాతో 400 బిలియన్ డాలర్ల ఒప్పందానికి ముందే ఇరాన్  చాబహర్ రైలు ప్రాజెక్టు నుంచి భారత్‌ను తప్పించింది. గత నాలుగేండ్ల తరువాత కూడా ఈ ప్రాజెక్టుకు భారతదేశం నిధులు ఇవ్వడం లేనందునే తామే ఈ ప్రాజెక్టును స్వయంగా పూర్తి చేసుకుంటామని ఇరాన్ చెప్తున్నది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా చాలా పెద్దదిగా భావిస్తున్నారు. చాబహర్ ఓడరేవు నుంచి జహేదాన్ మధ్య చాబహర్ రైలు ప్రాజెక్టును నిర్మించాల్సి ఉన్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: