గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నందుకు  జబర్దస్త్ ఫేమ్ బేబీ యోధకు టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ థాంక్స్ చెప్పారు. హరితహారంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ ఈఛాలెంజ్ కు శ్రీకారం చుట్టారు. ఈఛాలెంజ్ స్వీకరించిన వారు వీలైనన్ని మొక్కలునాటి మరో ముగ్గురిని ఈఛాలెంజ్ కు నామినేట్ చేయాల్సివుంటుంది. ఈఛాలెంజ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఈఛాలెంజ్ లో అనేక మంది ప్రముఖులు పాల్గొనగా కొద్దీ రోజుల క్రితం సమంత, శర్వానంద్ కూడా ఈఛాలెంజ్ ను పూర్తి చేశారు. 
 
ఇక తాజాగా జబర్దస్త్ యోధ, మాస్టర్ నిహంత్ నుండి  ఈఛాలెంజ్ ను స్వీకరించి ఖమ్మంలోని తన అమ్మమ్మ ఇంటివద్ద మొక్క నాటింది. ఈసందర్భంగా యోధ.. శ్రీముఖి, గెటప్ శ్రీను అలాగే ఆటో రామ్ ప్రసాద్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు నామినేట్ చేస్తున్నట్లు వీడియో ద్వారా తెలిపింది. ఇక సంతోష్ కుమార్ ఆవీడియో ను ట్విట్టర్ లో పోస్ట్ చేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనందుకు యోధకు థాంక్స్ చెప్పారు కాగా జబర్దస్త్ కామెడీషో ద్వారా యోధమంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం ఈషోతో పాటు యోధ పలు సినిమాల్లో కూడా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: