మంచివాళ్ళ  ముసుగులో ఉన్న మోసగాళ్ల బారినపడి ఇప్పటికే ఎంతోమంది మహిళలు మోసపోతున్న విషయం తెలిసిందే. ప్రేమ పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి ఆ తర్వాత శారీరకంగా వాడుకొని... ఆర్థికంగా కుంగదీసి  చివరికి మహిళలను రోడ్డు పాలు చేసిన ఘటనలు చాలానే తెర మీదకు వస్తున్నాయి. అయితే ఇలా మహిళలను వంచిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ... మంచి వాళ్ళ ముసుగులో  మోసాలకు పాల్పడుతున్న వారి తీరు మాత్రం ఎక్కడా మారడం లేదు. అయితే ఇలా కేవలం సామాన్య మహిళలకే కాదు ఏకంగా ప్రజలకు రక్షణ కల్పించే పోలీసు ఉద్యోగంలో కొనసాగుతున్న మహిళలకు సైతం రక్షణ లేకుండా పోయింది. ఓ మహిళా కానిస్టేబుల్ కు  మాయమాటలు చెప్పి మోసం చేశాడు ఇక్కడో మోసగాడు. 

 

 ఆ మోసగాడు ఎవరో కాదు ఆ మహిళ సహోద్యోగి కావడం గమనార్హం. ప్రజలకు రక్షణ కల్పించి ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పోలీసు ఉద్యోగంలో ఉండి... పోలీస్ డ్రెస్ వేసుకున్న కామాంధుడిగా మారిపోయాడు. తనతో పాటు పని చేస్తున్న మహిళా  కానిస్టేబుల్ పై కన్నేసి.. ప్రేమ పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ  ఘటన మహారాష్ట్రలోని లోని నాగ్  పూర్ లో జరిగింది. వెల్దురు పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న యువతిని... అక్కడే ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మరో పోలీసు అధికారి ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. 

 

 ఇక అతని ప్రేమ నిజమే అని భావించిన సదరు మహిళా కానిస్టేబుల్ అతన్ని  ప్రేమించింది. ఈ నేపథ్యంలో ఎన్నో మాయమాటలు చెప్పి 2015 నుంచి ఆమెపై అనేకమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు . ఇక మహిళా కానిస్టేబుల్ తనని పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడిపై ఒత్తిడి తీసుకు రావడం మొదలు పెట్టింది. ఇక  అప్పటి నుంచి కాస్త తప్పించుకుని తిరుగుతున్నాడు. ఏంటా అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఇటీవలే గుట్టుచప్పుడు కాకుండా మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని నిజం బయట పడడంతో ఈ విషయంపై బాధితురాలు కానిస్టేబుల్ ను  నిలదీయగా దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే ఆ మహిళా కానిస్టేబుల్ నాగ్ పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: