వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి అదేవిధంగా బీజేపీ లో ఉన్న సుజనాచౌదరి సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. విజయసాయి రెడ్డి...సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీ కోవర్ట్ అని బీజేపీ లో పైకి కాషాయ జెండా కప్పుకొని ఉన్నాగాని అంతరంగికంగా పసుపు సైన్యం అంటూ సుజనాచౌదరి ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. విజయసాయిరెడ్డి పెట్టిన పోస్ట్ కి బీజేపీ నేతల నుంచి ఊహించని రీతిలో కౌంటర్లు పడుతున్నాయి. మా పార్టీ జోలికొస్తే బాగోదు అని రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఎవరి పార్టీ గురించి వారు పట్టించుకుంటే బాగుంటుందని, మరికొంత మంది బీజేపీ నేతలు విజయసాయిరెడ్డి పెట్టిన పోస్ట్ కు ఘాటయిన కౌంటర్లు వేస్తున్నారు.

 

బీజేపీ లో ఎలాంటి మిడతల దండు మరియు పసుపు సైన్యం వచ్చిన గాని వాటిని కాషాయ సైన్యంగా మార్చుకుని ప్రజా సమస్యల కోసం పోరాడతామని భారీ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మరోపక్క సుజనా చౌదరి కూడా చాలా సీరియస్ గానే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు వేస్తున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ లో ఉన్న విష్ణువర్ధన్‌రెడ్డినో, జీవీఎల్‌ నరసింహారావునో, బీజేపీ ఏపీ ఇన్‌ఛార్జి సునీల్‌ దేవ్‌ధర్‌నో టార్గెట్ చేసి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేస్తే వినాలని ఉంది అని కొంతమంది ఇతర పార్టీలకు చెందిన వారు సోషల్ మీడియాలో కౌంటర్లు వేస్తున్నారు.

 

మరికొంత మంది నెటిజన్లు సోషల్ మీడియాలో ఈ వార్ కామెంట్లపై అనవసర లడాయి చౌదరి, రెడ్డి గారు చేసుకుంటున్నారు, విషయం లేదు నవ్వులపాలు కంటెంటు తప్ప ఎందుకొచ్చిన గొడవలు అంటూ మండిపడుతున్నారు. రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా మెలిగితే బాగుంటుంది. నవ్వులపాలయ్యే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటే ఒక ఏపీ లోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఏపీ రాజకీయ నేతల పరువు పోతుంది అంటూ సుజనా చౌదరి, విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వార్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: