మరి ఇప్పటికే సుజనాచౌదరికి, సీఎం రమేశ్ కు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు అనే అభిప్రాయాలున్నాయి. బాబు వాళ్ల మాటను జవదాటడని.. వాళ్లు చెప్పిందే తెలుగుదేశం పార్టీలో వేదమని మీడియా వర్గాలు అంటాయి. తెలుగుదేశం నేతల్లో కూడా చాలా మందిలో ఇదే భావన ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఇమేజ్ ను చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని అందరూ అనుకొంటారు. వారిద్దరినీ రాజ్యసభకు పంపి అగ్రతాంబూలం ఇచ్చిన చంద్రబాబు నాయుడు వారిని క్యాబినెట్ సమావేశాలకు కూడా పిలిపించుకొని.. వారి కనుసన్నల్లో పాలన చేస్తున్నాడనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే బాబు ఇలాంటి ఆరోపణలను, అభిప్రాయాలను పట్టించుకోవడం లేదు. తాజాగా వారిద్దరినీ కేంద్రమంత్రులను చేసేందుకు తెలుగుదేశం అధినేత ప్రయత్నిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. సుజనాచౌదరి, సీఎం రమేశ్ లకు కేంద్రంలో కనీసం సహాయమంత్రి పదవి అయినా ఇప్పించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడట. తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఎంపీలు ఇప్పుడు కేంద్రమంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వారందరినీ పక్కనపెట్టి చంద్రబాబు మాత్రం సుజనా, సీఎం రమేశ్ ల పేర్లను మాత్రమే పట్టుకొని ఢిల్లీ వెళ్లాడట. దీంతో... బాబు ఈ విషయంలో ఎవరినీ లెక్క చేయడం లేదని స్పష్టం అవుతోంది. ఎవ్వరు ఏమనుకొన్నా..తను మాత్రం వారికి ఇచ్చే ప్రాధాన్యతన ఇస్తానన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నాడు. వాళ్లు ప్రజల్లోంచి వచ్చిన వారు కాకపోయినా.. వ్యాపారస్తులు అయినా.. వారిని కేంద్రమంత్రులుగా చేసేందుకు తను వెనుకాడేది లేదనే ఇండికేషన్ ఇస్తున్నాడు తెలుగుదేశం అధినేత. మరి ఇలాంటి తీరు ఫలితాలు భవిష్యత్తుపై ఎలా ఉంటాయో!

మరింత సమాచారం తెలుసుకోండి: