తెలంగాణ కేబినెట్ నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్యను తప్పించారు. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు రాజయ్య తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. కేసీఆర్ సిఫార్సు మేరకు రాజయ్య రాజీనామాను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆమోదించారు. గవర్నర్ ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువరించారు. రాజయ్యను మంత్రివర్గం నుంచి తప్పించే పరిణామాలు ఆదివారం ఉదయం నుంచీ క్రమంగా వడివడిగా జరిగిపోయాయి. వైద్య ఆరోగ్యశాఖలో జరిగిన అవినీతి విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. అందుకే ఆ శాఖ మంత్రి డాక్టర్ రాజయ్యను పదవి నుంచి తప్పించారు. రాజయ్య స్థానంలో వరంగల్ ఎంపీ కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కడియం శ్రీహరికి విద్యుత్ శాఖను కేటాయించి, మరో మంత్రి లక్ష్మారెడ్డికి వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాజయ్య పేషీలోని అధికారులందరినీ తప్పించిన కేసీఆర్ ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎంను కూడా తొలగించడం తీవ్ర నిర్ణయమేనంటున్నారు. అవినీతికి పాల్పడితే తన సొంత కుటుంబ సభ్యులనైనా వదిలేది లేదని కేసీఆర్ గతంలోనే ప్రకటించిన విషయం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: