రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరూ చెప్పేలేరు. ఏళ్ల తరబడి ఒకే పార్టీలో ఉన్న నాయకులే జెండాలు మార్చేస్తున్నారు. ఇక చిన్న నాయకుల సంగతి ఏం చెబుతాం. మూలింటి మారెప్ప.. ఈయన గుర్తొచ్చారా... వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు.

మారెప్ప.. వైఎస్ అంటే ప్రాణమిస్తాడు. అలాంటి ఆయనే వైఎస్ చనిపోయన కొన్ని నెలలకే జగన్ కు గుడ్ బై చెప్పేశాడు. వైఎస్ కు ఉన్న మంచి మనసుకు జగన్ కు లేదంటాడీయన. తాజాగా ఆంధ్రా అసెంబ్లీలో జరిగిన గొడవపై ఆయన స్పందించారు.

దళితులను మోసం చేసిన జగన్మోహన్‌రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసీటీ కేసును నమోదు చేసి జైల్లో పెట్టాలని ఆవేశపడిపోయారు. వైసీపీలో ఇప్పుడు దొంగలు, గజదొంగలు ముఠా నాయకులే రాజ్యమేలుతున్నారన్నారు. జగన్ కు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై కనీస అవగాహన లేవన్నారు మారెప్ప.

తనలాంటి దళిత నాయకులను యూజ్ అండ్ త్రో పాలసీలో వాడుకున్నాడని నిప్పులు చెరిగారు. దిల్లున్నోడు.. వెల్లులోకి ఎమ్మెల్యేలను పంపడని సెటైర్లు వేశారు. జైల్లో ఉండి వచ్చాడు కాబట్టే రోజాలాంటి వ్యక్తిని ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు. ల్యాండు, శాండు, వైను, మైను వంటి కుంభకోణాలు చేసిన పొలిటికల్ పంచభూతాలే జగన్ పంచన చేయాలని విమర్శించారు. దళిత మంత్రిని కించపరుస్తున్న వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: