ఇప్పడు జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్ లు ఎంత ప్రాముఖ్యత చెందాయో అందరికీ తెలుసు. పిల్లలకు వేసవి సెలవలు రావడంతో ఒక్కొక్కరు టీవిలకే అతుక్కు పోయారు. ఈ రోజు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్-8 నాలుగో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ముగిసింది. 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. 56 బంతుల్లో సెంచరీ చేసిన మెక్ కల్లమ్ నాటౌట్ గా నిలిచాడు. 9 సిక్సులు, 7 ఫోర్లతో చెలరేగాడు. కెప్టెన్ ధోనీ 4 సిక్సులు, 4 ఫోర్లతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. 198 పరుగుల దగ్గర ఒకే బంతి తేడాతో ధోనీ, జడేజా ఔటయ్యారు. ప్రత్యర్ధి జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ ముందు 210 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: