గత కొద్ది నెలలుగా పలు నేషనల్ మీడియా వర్గాలు తమ సర్వే ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సారి వైసీపీ కచ్చితంగా గెలుస్తుందని తేల్చి చెప్పేసినా, చంద్రబాబు మాత్రం అవి అన్నీ అమ్ముడుపోయిన నకిలీ సర్వేలు అని కొట్టిపారేశారు. ఇక లోక్ సభ స్థానాల్లో జగన్ కు తిరుగు లేదు అని అందరూ లెక్కలు వేసి చెప్తున్నా, తన విజయం పై ధీమాగా ఉన్న బాబుకి ఒక్కసారిగా ఓటమి భయం పట్టుకుంది.


ఇందుకు కారణం “ఆంధ్ర ఆక్టోపస్” గా పిలవబడే లగడపాటి రాజగోపాల్ ఇచ్చిన సర్వే రిపోర్ట్. అసలు సిసలైన పక్కా నివేదిక కోసం కొంతకాలంగా బాబు లగడపాటి బినామీ కంపెనీకి ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చేలా చూస్తూ ఆర్థికంగా అండగా ఉంటున్నాడు. మొన్న తెలంగాణ ఎన్నికల్లో కూడా లగడపాటి చేత కావాలనే కూటమి గెలుస్తుందని తప్పుడు రిపోర్టు ఇప్పించాడు అని వార్తలు వచ్చాయి.


అయితే ఈ సారి రాజగోపాల్ తన అనుభవాన్ని అంతా రంగరించి, ఎంతో విస్తృతంగా సర్వే జరిపి చివరికి తేల్చింది ఎందయ్యా అంటే, రానున్న ఎన్నికలలో వైసీపీ విజయ భేరీ మోగించడం తథ్యం అని. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జగన్ కి తిరుగులేదు అని తేల్చేశాడట. పట్టణంలో టీడీపీ జోరు చూపిస్తున్నా, జగన్ ఈ సారి ముఖ్యమంత్రి కావడం పక్కా అని లగడపాటి చివరికి పెదవి విరిచారట. ఇంకేముంది బాబుకి వెన్నులో వణుకు మొదలైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: