తన నడిపిస్తున్న కాలేజీలకు ఫీజులు చెల్లించాలంటూ మోహన్ బాబు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. రెండు రోజుల కిందట తిరుపతిలో తన విద్యా సంస్థల విద్యార్థులతో కలిసి నిరసన ర్యాలీకి దిగిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.ఈ అంశంపై ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యాక్షుడు కుటుంబరావు విమర్శలు గుప్పించడంతో రాజకీయంగా ఈ అంశం ప్రాధాన్యంగా మారింది. బకాయిల విషయంలో మోహన్ బాబు రాజకీయాలు చేస్తున్నారంటూ కుటుంబరావు చేసిన వ్యాఖ్యలకు మంచు మనోజ్ శనివారం ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబును పరోక్షంగా టార్గెట్ చేస్తూ మోహన్ బాబు బహిరంగ లేఖ ఒకటి రాసి ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

Image result for mohan babu

 ఆ లేఖలో మోహన్ బాబు... చంద్రబాబు పేరును ప్రస్తావించకుండానే తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఫీజు రీయింబర్స్ మెంట్ అడిగితే తమపై కక్షసాధింపు మొదలుపెట్టాడని ఆ గ్రేట్ అబద్ధాల కోరు గురించి చెప్పాలంటే ఒక గ్రంథం తయారవుతుందని అందులో అన్నారు. 2013లో అతడు అధికారంలో లేకపోయినా ఎంతో గౌరవించి నా ఫంక్షన్స్ సినిమా ఓపెనింగ్స్ ఎన్ని జరిగాయో అన్నింటికీ పిలిచాను. కావాలంటే ఇంటర్నెట్లో చూసుకోండి అంటూ లేఖలో మండిపడ్డారు. అంతేకాదు.. రాజకీయంగా పలు వివాదాస్పద అంశాలనూ మోహన్ బాబు ఆ లేఖలో ప్రస్తావించారు.

Image result for chandra babu

'అన్న ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు పార్టీని ఏమి చేశావో అవననీ చెబితే బాగుండదు.. ఇక నన్ను రెచ్చగొడితే నీ చరిత్ర అన్నయ్యకు జరిగిన ఘోరాలు చేసిన మోసాలు అడగడుగునా అనుక్షణం బయటపెడతా. నువ్వు చెయ్యగలిగితే ఒక్కటే చేయగలవు.. అది నన్ను చంపించడం అంతే.. ఇంతకంటే ఏమీ చేయలేవు.. నీకు ఆ రాజకీయాలు కూడా తెలుసని నాకు తెలుసు'. అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలో లేకపోయినా ఎంతో గౌరవించి ప్రతి కార్యక్రమానికీ ఆహ్వానించాను.. కానీ నామీద నా కుటుంబం మీద కక్షసాధింపు చర్య చేపట్టాడు.. నేను అడిగింది మా విద్యా సంస్థల్లో చదువుతోన్న పిల్లలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బు.. అది అడిగితే అతడికి చెప్పే ధైర్యం లేక ఇద్దరు జోకర్ల దగ్గర చెప్పిస్తున్నాడు. అని మండిపడ్డాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: