మానవత్వం మంటకలిసి పోతుంది..ఉచ్ఛనీచాలు మర్చిపోతున్నారు..ఆడది అని తెలిస్తే చాలు చిత్తె కార్తె కుక్కల్లా రెచ్చిపోతున్నారు.  తన..పరాయ అనే భేదాలు లేకుండా లైంగిక దాడులకు తెగబడుతున్నారు కొంతరు కామాంధులు.  తాజాగా హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో దారుణం జరిగింది. పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాలనే తండ్రే కాటేశాడు.

వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో డైరీ ఫామ్ దగ్గర నివాసం ఉండే వెంకటేశ్వర్లు మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసు కున్నాడు.  అయితే గత రెండు సంవత్సరాల నుంచి మొదటి భార్య కూతురుపై కన్ను పడి ఆమెను బలవంతంగా అత్యాచారం చేస్తూ వచ్చాడు.  ఈ బాధ తన పిన్నికి వివరించినా..పెద్దగా పట్టించుకోకపోగా ఎవరికైనా చెబితే పరువు పోతుందని భయపెట్టింది.  ఆ తండ్రి ఆగడాలు రోజు రోజుకీ మితిమీరిపోయాయి.  దాంతో ఆ బాధితురాలు తట్టుకోలేక పోయింది. 

తన కష్టాల్ని స్నేహితురాళ్లతో చెప్పుకోవడంతో వారు తండ్రి వెంకటేశ్వర్లుపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ నీచుడిని కటకటాల్లోకి నెట్టారు. యువతిని చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ సెల్ కి తరలించారు. కాగా, కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కామంతో కళ్లు మూసుకుపోయి కన్న బిడ్డపై అఘాయిత్యానికి పాల్పపడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఆ నీచుడికి కఠిన శిక్ష విధించాలని..అతనికి సహకరించిన ఆమె పిన్నిని కూడా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.


మరింత సమాచారం తెలుసుకోండి: