ఎన్నికల తర్వాత ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లనే విషయం ఉత్కంఠగా మారింది. దీనిపై ఇప్పటికే ఎన్నో అంచనాలు వెలువడ్టాయి. వాటిలో చాలా వరకూ వైసీపీ గెలుస్తుందనే చెప్పాయి. తాజాగా ఓ యూట్యూబ్ చానల్ తన సర్వేను ప్రకటించింది. 


తమ టీమ్‌ ప్రతి నియోజకవర్గం తిరిగి ఈ వివరాలు సేకరించిందని ఆ ఛానల్ ప్రకటించింది. అంతేకాదు.. తమ సర్వే నిజం కాకపోతే.. తమ ఛానల్‌ ను డిలీట్ చేస్తామని ప్రకటించింది. ఈ సంస్థ అంత గట్టిగా చెప్పడంతో నిజం కావచ్చేమే అనిపించేలా ఉంది. 

ఈ సర్వే ప్రకారం వైసీపీ 100 స్థానాలు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందట. ఇక అధికార టీడీపీ 72  స్థానాలతో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తుందట. మరో పార్టీ జనసేన కేవలం మూడు స్థానాల్లోనే గెలుస్తుందని ఈ ఛానల్ అంచనా వేస్తోంది. 

అయితే వైసీపీ విషయంలో చాలా ఖరాఖండీగా లెక్కలు వేశామని.. ఇంకా వైసీపీకి ఇంత కంటే ఓ పది సీట్లు ఎక్కువైనా రావచ్చు కానీ.. తక్కువ వచ్చే ఛాన్స్ లేనేలేదని ఆ ఛానల్ ప్రకటించింది. మరి ఈ సర్వే ఎంతవరకూ నిజమవుతుందో గానీ సోషల్ మీడియాలో బాగానే షేర్ అవుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: