ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసి.. ఫలితాల కోసం వేచి చూసేందుకు 40 రోజుల సమయం ఉండటంతో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పుకార్లలో ఎక్కువ భాగం వైసీపీ పైనే వస్తున్నాయి. జగన్ మంత్రివర్గం ఏర్పాటుపైనా.. జగన్ నేమ్ ప్లేట్ పైనా రాద్ధాంతం జరిగిన సంగతి తెలిసిందే. 


ఇక ఇప్పుడు జగన్ ప్రమాణ స్వీకారంపై పుకార్లు మొదలయ్యాయి. సాధారణంగా సీఎం ప్రమాణ స్వీకారం రాజధానిలోనే జరుగుతుంది. కానీ ఇందుకు విరుద్ధంగా జగన్ ఇడుపులపాయలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ పుకార్లు పుట్టిస్తున్నారు.

ఇప్పటికే ఇడుపుల పాయలో భూమి చదును చేయిస్తున్నారని.. ఇది ప్రమాణ స్వీకారం కోసమేనని వదంతులు వ్యాపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అసలు ఇడుపుల పాయలో అలాంటి పనులే జరగడం లేదని చెబుతున్నాయి.  

ఇవన్నీ జగన్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు కొందరు చేస్తున్న ప్రచారంగానే తెలుస్తోంది.. చూశారా.. ఫలితాలు రాకముందే జగన్ నేమ్‌ ప్లేట్ చేయించుకున్నాడు.. మంత్రులను ప్రకటిస్తున్నాడు..ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేసుకుంటున్నాడని ప్రచారం చేయడం ద్వారా జగన్ కు పదవీకాంక్ష అన్న విషయాన్ని హైలెట్ చేసుందుకు జరుగుతున్న ప్రయత్నాలే ఇవన్నీ.



మరింత సమాచారం తెలుసుకోండి: