శ్రీకాకుళం జిల్లాలో మందుబాబులు రెచ్చిపోయారు. తాగిన మైకంలో ఒకపై ఒకరు కొట్టుకున్నారు. బీరు బాటిళ్లతో దాడి చేసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు ఇష్టమొచ్చినట్టు కొట్టుకోవడంతో ఇద్దరు యువకుల తలలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. ఓ సిగరేట్ పొగ విషయంలో ఈ ఘర్షణ తలెత్తడమే కారణం.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వైన్స్ షాపులో చోటు చేసుకున్న ఘర్షణ స్థానికంగా కలకలం రేపుంతోంది.
ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసుకున్నారు. కేసు పై దర్యాప్తు చేపట్టారు.
వైన్స్ లో ఓ టేబుల్ వద్ద కొంత మంది యువకులు మద్యం సేవిస్తున్నారు. అంతలోనే స్థానికంగా ఉంటున్న మరి కొంత మంది యువకులు మరో టేబుల్ వద్దకు వచ్చి తాగుతున్నారు. ఈ క్రమంలోనే బీరు తాగులూ ఓ బృందంలోని యువకుడు అక్కడే సిగరేట్ వెలిగించాడు. మరో టేబుల్ పై వద్ద కూర్చున్న యువకులు దానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. కాస్త పక్కకు వెళ్లి కాల్చుకోమని చెప్పడంతో రెండు బృందాల మధ్య ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియకుండా పోయిందని స్థానికులు తెలిపారు.
మాటలతో ప్రారంభమైన గొడవ బీరు బాటిళ్లతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. బీరు బాటిళ్లతో ఒకరిపై ఒకరు కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు యువకుల తలలు పగిలాయి. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సదురు యువకులు కొందరు జంప్ అయ్యాయి. ఇక గాయపడ్డా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. బాధితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.