కామాతురానాం నభయం న లజ్జ..కామంతో కళ్లు మూసుకున్న వాడికి కంటికి చిన్నా పేద్దా తార తమ్యం తెలియదు..ఆడది కనిపిస్తే చాలు చిత్త కార్తె కుక్కలా రెచ్చిపోతుంటారు.  సంఘంలో ఇలాంటి వారు ఈ మద్య గల్లీకొక్కడు తయారయ్యాడు.  ప్రతిరోజూ మహిళలు, చిన్నారులు చివరికి వృద్దులపై సైతం కామాంధులు రెచ్చిపోతున్నారు.  హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులతో ఇబ్బందులు పెడుతున్నారు. 

తాజాగా ఓ దుర్మార్గుడు 15 ఏళ్ల బాలికపై అఘాయిత్యం చేశాడు..ప్రేమ, పెళ్లి అంటూ వెంటపడి.. బలవంతంగా మెడలో తాళికట్టి.. బెదిరించి కాపురం చేశాడు. వివరాల్లోకి వెళితే..ఎమ్మిగనూరు పట్టణం గాంధీనగర్ కి చెందిన ఓ మహిళ 2015లో హెచ్ఐవీ తో కన్నుమూసింది.  ఆమె కూతురు కి కూడా ఆ వ్యాది సోకిందని కొంత కాలం తర్వాత తెలిసిందే. 

దాంతో ఆ బాలికను తండ్రి ఆదోనిలోని స్వచ్ఛంద సంస్థలో చేర్పించారు.  ప్రస్తుతం అక్కడే చికిత్స తీసుకుంటూ చదువుకుంటుంది.  గత కొంత కాలంగా ఆ అమ్మాయికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తన తండ్రి వద్దకు వచ్చేసింది.  అయితే ఆమె అనారోగ్యంగా ఉందని తెలిసి కూడా ఆ ఊరికే చెందిన శంకర్ అనే యువకుడు లైంగిక వేధింపులకు పాల్పపడ్డాడు. 

అంతే కాదు తనకు హెచ్ఐవీ ఉందని బాలిక చెప్పినా వినకుండా బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకొని మూడు నెలల పాటు కాపురం చేశాడు. మూడు నెలలు అతని నరకాన్ని భరించిన ఆ బాలిక ఎలాగో అల తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: