టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ లేటెస్ట్ సినిమా మ‌హ‌ర్షి మ‌రో మూడు రోజుల‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. మ‌హేష్ కెరీర్‌లో 25వ సినిమాగా తెర‌కెక్కిన ఈ సినిమాను ముగ్గురు టాలీవుడ్ అగ్ర‌నిర్మాత‌లు దిల్ రాజు - అశ్వ‌నీద‌త్ - పీవీపీ క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌. భారీ అంచ‌నాల‌తో వ‌స్తోన్న ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో మ‌హేష్ బిజీబిజీగా ఉంటున్నాడు.


ఈ ప్ర‌మోష‌న్ల‌లో అనేక విష‌యాలు త‌న‌తో పంచుకుంటోన్న త‌న తొలి సినిమా రాజ‌కుమారుడు నుంచి నేటి మ‌హ‌ర్షి వ‌ర‌కు అనే కొత్త విష‌యాలు ప్రేక్ష‌కుల‌తో పంచుకుంటున్నాడు. ఇక మురారి సినిమా త‌న‌లోని మంచి న‌టుడు ఉన్నాడ‌న్న విష‌యాన్ని తొలిసారిగా అంద‌రికి తెలిసేలా చేసింద‌ని చెప్పాడు. మురారి సినిమా కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఇవ‌న్నీ ఇలా ఉంటే మ‌హేష్ సినిమా క‌థ‌ల విష‌యంలో కొన్ని సినిమాల నుంచి వినిపిస్తోన్న రూమ‌ర్ల‌కు ప‌రోక్షంగా చెక్ పెట్టాడు. 


మ‌హేష్ న‌టించిన దూకుడు సినిమా త‌ర్వాత నుంచి మ‌హేష్ సినిమా క‌థ‌ల విష‌యంలో ముందుగా న‌మ్ర‌త విని ఓకే చేశాకే ఆ సినిమా ప‌ట్టాలెక్కుతోంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల్లో నిజం ఎంత ఉన్నా శ్రీమంతుడు, భ‌ర‌త్ అనే నేను సినిమాల‌కు న‌మ‌త్ర ప్ర‌మోష‌న్ల విష‌యంలో ప్ర‌ణాళిక‌ల‌తో వెళ్లి సినిమాకు ఎక్కువ క‌లెక్ష‌న్లు వ‌చ్చేలా చేయ‌డంలో త‌న వంతు పాత్ర పోషించింది. ఇక తాజా ఇంట‌ర్వ్యూలో మ‌హేష్ త‌న 25 సినిమాల జ‌ర్నీలోనూ ప్ర‌తి సినిమా క‌థ తానే విని చేయాలా ?  వ‌ద్దా ? అన్న డెసిష‌న్ తానే తీసుకుంటాన‌ని... ప‌రోక్షంగా న‌మ్ర‌త క‌థకు ఓకే చెప్పాలంటూ వ‌స్తోన్న రూమ‌ర్ల‌కు చెక్ పెట్టేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: