న‌ర‌రూప రాక్ష‌సుడు హ‌జీపూర్ సీరియ‌ల్ కిల్ల‌ర్ మ‌ర్రి శ్రీనివాస్‌రెడ్డి పోలీసులు క‌స్ట‌డీలోకి తీసుకొని విచారిస్తున్నారు. భారీ బందోబ‌స్తు నడుమ మ‌ర్రి శ్రీనివాస్‌రెడ్డిని నిన్న వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైలు నుంచి హైద‌రాబాద్ స‌రూర్‌న‌గ‌ర్‌లోని ఎస్‌వోటీ కార్యాల‌యానికి త‌ర‌లించారు పోలీసులు. స‌రూర్‌న‌గ‌ర్‌లోని ఎస్‌వోటీ కార్యాల‌యంలో శ్రీనివాస‌రెడ్డిని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. 


చ‌నిపోయిన ముగ్గురు బాలిక‌లే కాకుండా సైకో కిల్ల‌ర్ బారిన మ‌రికొంత‌మంది బాధితులు ఉన్న‌ట్లు పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే నిందితుడి పాత క్రైమ్ రికార్డును కూడా పోలీసులు ప‌రిశీలిస్తున్నారు. మ‌రోవైపు అటు ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ప్ర‌త్య‌క్ష సాక్షులు, స్నేహితుల‌ను సిట్ బృందం విచారిస్తుంది. 


సైకో కిల్ల‌ర్ మ‌ర్రి శ్రీనివాస్ రెడ్డికి ఇంకా ఎవ‌ర‌న్న స‌హ‌క‌రించారా ? అన్న కోణంలో మ‌రింత లోతుగా పోలీసులు విచారిస్తున్నారు. ఈ ద‌ర్యాప్తులో నిందితుడి ఫోన్ కాల్ డేటా కీల‌కంగా మారింది. కాల్ డేటా ఆధారంగా ప‌లువురిని విచారించే ప‌నిలో ఉంది సిట్‌. కాల్ లిస్ట్ ఆధారంగా కీల‌క విష‌యాలు ల‌భించే అవ‌కాశం ఉన్న‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. 


బొమ్మ‌ల‌రామారం హాజీపూర్‌లో ఇవాళ సీన్ రీక‌న్స్ స్ట్ర‌క్ష‌న్ చేసే యోచ‌న‌లో పోలీసులు ఉన్నారు. ఇక సైకోకిల్ల‌ర్ శ్రీనివాస్‌రెడ్డి ఏ విధంగా అరాచ‌కాలు చేశాడ‌న్న కోణంలో పోలీసులు సీన్ రీక‌న్స్ స్ట్ర‌క్ష‌న్ చేయ‌నున్నారు. స‌రూర్‌న‌గ‌ర్ ఎస్‌వోటీ కేంద్రంగా నే నిందితుడిని ఈనెల 13 వ తేదీ వ‌ర‌కు సిట్ బృందం విచారించనుంది. 


రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో యువ‌తులు, బాలిక‌ల మిస్సింగ్ కేసు నేప‌థ్యంలో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి విచారిస్తున్నారు. శ్రీనివాస‌రెడ్డిలో ఇంత‌లా నేరగాడిగా మార‌డానికి గ‌ల కార‌ణాలేంటీ..? శ‌్రీనివాస్‌రెడ్డి చేతిలో ఇప్ప‌టివ‌ర‌కు ఎంత మంది బ‌ల‌య్యార‌న్న కోణంలో సిట్ బృందం ఆ రాక్ష‌సుడిని ప్ర‌శ్నిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: